Amarnath Yatra: అమర్ నాథ్ లో కుంభవృష్టి.. వరదల్లో చిక్కుకుని 10 మంది మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ అమర్ నాథ్ లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమర్ నాథ్ పరిసరాల్లో వరదలు సంభవించాయి. అమర్ నాథ్ గుహవద్దకు వరద నీరు చేరింది. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అమర్ నాథ్ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరదలు ముంచెత్తాయి. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వరదల్లో యాత్రికులు వేసిన టెంట్లు కూడా కొట్టుకుపోయాయి.బోలేనాథ్ గుహ వద్ద వరదల్లో దాదాపుగా 12 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పాటు లోయల్లో యాత్రికులు వేసుకున్న టెంట్లన్ని కొట్టుకుపోయాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకువచ్చేలా రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Chandrababu: మొన్న చెల్లి వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి వెళ్లిపోయింది..!
గత నెల 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అయింది. ఆగస్టు 11 వరకు ఈ యాత్ర జరగనుంది. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా అమర్ నాథ్ యాత్ర జరగలేదు. దీంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు వచ్చారు. అయితే నిన్నటి నుంచి అమర్ నాథ్ పరిసరాల్లో భారీగా వర్షం పడుతుండటంతో పాటు కొండలపై నుంచి మెరుపు వరదలు పరిసరాలను ముంచెత్తాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వాతావరణం రెస్క్యూ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.
ప్రధాని మోదీ అమర్ నాథ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాతో మాట్లాడానని.. సహాయక చర్యలు కొనసాగుతాయని ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported at around 5.30 pm. Rescue operation underway by NDRF, SDRF & other associated agencies. Further details awaited: Joint Police Control Room, Pahalgam
(Source: ITBP) pic.twitter.com/AEBgkWgsNp
— ANI (@ANI) July 8, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!