ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్కు మా వంతు తోడ్పాటు అందిస్తాం.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తున్నాం.. 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ గెలుపుకోసమే మేం పనిచేస్తాం'' అని తన ట్వీట్లో పేర్కొంది ఐప్యాక్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే ఆయన కాంగ్రెస్ లో చురుకైన పాత్రను పోషిస్తూ వచ్చారు. అయితే, పంజాబ్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. బెంగాల్ ఎన్నికల తరువాత ఎన్నికల వ్యూహకర్తగా విధులు నిర్వహింబోనని చెప్పడంతో ఆయన కాంగ్రెస్ చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే, కాంగ్రెస్లో కొంతమంది పెద్దలు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహాల వరకే…