BJP: బీజేపీకి దగ్గరవుతున్న పాత మిత్రులు.. ఎన్నికల్లో బీజేపీ-అకాళీదళ్ పొత్తు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయంలో ఉండటంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ స్ట్రాటజీ ప్లాన్ వర్కవుట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే గతంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమిలో భాగంగా ఉండీ.. ఆ తరువాత పలు రాజకీయ పరిణామాలతో బీజేపీని వదిలి వెళ్లిన పార్టీలు మళ్లీ బీజేపీ చెంతకు చేరుతున్నాయి. పాత మిత్రులు మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో పాత మిత్రుడు దేవెగౌడ పార్టీ జేడీఎస్, నరేంద్రమోడీకి మద్దతు ప్రకటిస్తోంది. ఇక ఏపీలో టీడీపీ కూడా ఎన్డీయే కూటమికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది.
గతంలో పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉండీ, ఎన్డీయే కూటమిలో చక్రం తిప్పిన అకాళీదళ్ ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు కకావికలం అయింది. రైతు ఉద్యమ సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన అకాళీదళ్ కు పొలిటికల్ మైలేజ్ కూడా లభించలేదు. పంజాబ్ లో 2019 ఎన్నికల్లో అకాళీదళ్ 10, బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఈ సారి కూడా ఇదే స్థాయిలో సీట్ల పంపకం జరిగితే ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు.
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
Read Also: Nitish Kumar: మళ్లీ ఎన్డీయేలోకి నితీష్ కుమార్..? వరస భేటీలతో ఊహాగానాలు..
వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ దెబ్బకు అకాళీదళ్ పత్తా లేకుండా పోయింది. రెండు దశాబ్ధాలుగా అకాలీదళ్, బీజేపీ కూటమి విచ్ఛిన్నం కావడం అక్కడ ఆప్ కు ప్లస్ గా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు కూడాలని అనుకుంటున్నాయి. ఇటీవల అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ చనిపోయిన సమయంలో ప్రధాని నివాళులు అర్పించేందుకు చంఢీగడ్ వెళ్లారు. ఆయనను సోదరుడని సంభోదించారు. ఆ సమయంలోనే ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
2019 ఎన్నికల్లో పంజాబ్ లోని 13 ఎంపీ స్థానాల్లో 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే.. బీజేపీ, అకాళీదల్ చెరో రెండు స్థానాల్లో, ఆప్ ఒక స్థానంలో విజయం సాధించాయి. అయితే 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇరు పార్టీలు విడిపోయి దెబ్బతిన్నాయి. ఆప్ 42 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలవగా, కాంగ్రెస్ 22.98 శాతం, ఎస్ఏడీ 18.38 శాతం, బీజేపీ 6.60 శాతం ఓట్ల పొందాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో అకాలీ దళ్ కి 27.8 శాతం ఓట్లు వస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 18.38 శాతానికి పడిపోయింది. ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసి పోటీ చేద్ధాం అని అనుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..