Nitish Kumar: మళ్లీ ఎన్డీయేలోకి నితీష్ కుమార్..? వరస భేటీలతో ఊహాగానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విపక్షాల ఐక్యతను బీహార్ సీఎం నితీష్ వదిలేస్తున్నారా.. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి మళ్లీ చేరబోతున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరసగా భేటీలు చూస్తే కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్తో భేటీ అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు, జేడీయూలో చీలక గురించి భయపడుతున్నారా..? అనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.
గతేడాది ఆగస్టులో బీజేపీతో పొత్తు తెంచుకుని, ఆర్జేడీ-కాంగ్రెస్ సహాయంతో మరోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. అయితే ఆ సమయంలో రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ గా హరివంశ్ ఉన్నారు. అప్పటి నుంచి హరివంశ్ తో సీఎం నితీష్ కుమార్ ఎప్పుడూ భేటీ కాలేదు. కానీ తాజాగా ఈ రోజు ఆయనతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీతో పొత్తు తెంచుకున్న సమయంలో హరివంశ్ ను స్పీకర్ పదవి నుంచి తొంలగించేందుక ఇటు బీజేపీ కానీ.. అటు జేడీయూ కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నితీష్ కుమార్ బీజేపీతో టచ్ లో ఉండేందుకే హరివంశ్ ను అలాగే ఉంచారనే వాదనలు కూడా ఉన్నాయి.
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Read Also: Bandi Sanjay: కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుంది
ఇదిలా ఉంటే గత ఐదు రోజులుగా నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వరసగా భేటీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హరివంశ్ తో సమావేశమయ్యారు. నిజానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం.. 2019 ఎన్నికల్లో జేడీయూ ఎంపీలు, ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. మళ్లీ వారితోనే పొత్తు పెట్టుకోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపొందిన జేడీయూ ఎంపీలకు 2024 ఎన్నికల్లో టికెట్లు నిరాకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వారంతా భయపడుతున్నట్లు సమాచారం. ఇటీవల పాట్నా వేదికగా నితీష్ కుమార్ విపక్షాల సమావేశం నిర్వహించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఐక్యంగా పోరాటం చేయాలని హజరైన అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తర్వాత సమావేశం బెంగళూర్ వేదికగా విపక్షాల సమావేశం జరగాల్సి ఉంది.
- Tags
- bihar
- bjp
- CM Nitish Kumar
- JDU
- NDA
తాజావార్తలు
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!