Nitish Kumar: మళ్లీ ఎన్డీయేలోకి నితీష్ కుమార్..? వరస భేటీలతో ఊహాగానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విపక్షాల ఐక్యతను బీహార్ సీఎం నితీష్ వదిలేస్తున్నారా.. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి మళ్లీ చేరబోతున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరసగా భేటీలు చూస్తే కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్తో భేటీ అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు, జేడీయూలో చీలక గురించి భయపడుతున్నారా..? అనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.
గతేడాది ఆగస్టులో బీజేపీతో పొత్తు తెంచుకుని, ఆర్జేడీ-కాంగ్రెస్ సహాయంతో మరోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. అయితే ఆ సమయంలో రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ గా హరివంశ్ ఉన్నారు. అప్పటి నుంచి హరివంశ్ తో సీఎం నితీష్ కుమార్ ఎప్పుడూ భేటీ కాలేదు. కానీ తాజాగా ఈ రోజు ఆయనతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీతో పొత్తు తెంచుకున్న సమయంలో హరివంశ్ ను స్పీకర్ పదవి నుంచి తొంలగించేందుక ఇటు బీజేపీ కానీ.. అటు జేడీయూ కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నితీష్ కుమార్ బీజేపీతో టచ్ లో ఉండేందుకే హరివంశ్ ను అలాగే ఉంచారనే వాదనలు కూడా ఉన్నాయి.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Bandi Sanjay: కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుంది
ఇదిలా ఉంటే గత ఐదు రోజులుగా నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వరసగా భేటీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హరివంశ్ తో సమావేశమయ్యారు. నిజానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం.. 2019 ఎన్నికల్లో జేడీయూ ఎంపీలు, ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. మళ్లీ వారితోనే పొత్తు పెట్టుకోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపొందిన జేడీయూ ఎంపీలకు 2024 ఎన్నికల్లో టికెట్లు నిరాకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో వారంతా భయపడుతున్నట్లు సమాచారం. ఇటీవల పాట్నా వేదికగా నితీష్ కుమార్ విపక్షాల సమావేశం నిర్వహించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఐక్యంగా పోరాటం చేయాలని హజరైన అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తర్వాత సమావేశం బెంగళూర్ వేదికగా విపక్షాల సమావేశం జరగాల్సి ఉంది.
- Tags
- bihar
- bjp
- CM Nitish Kumar
- JDU
- NDA
తాజావార్తలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!