President Elections: అనూహ్యంగా తెరపైకి అజిత్ దోవల్..? రాష్ట్రపతి అభ్యర్థి ఆయనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షానికి చెందిన అభ్యర్థి ఎవరు..? అనే అంశంపై చర్చ హాట్ టాపిక్గా సాగుతోంది.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు పేర్లు ప్రచారంలో ఉండగా.. అందులో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది.. జాతీయ భద్రతా సలహాదారుగా దేశానికి ఎంతో సేవ అందించిన అజిత్ దోవల్ను రాష్ట్రపతిని చేయాలని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భావిస్తున్నట్టు సమాచారం..
Read Also: Karamam Dharmasri: టీచర్ ఉద్యోగం సంపాదించిన వైసీపీ ఎమ్మెల్యే
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే, ఆ తర్వాత అజిత్ దోవల్ పేరు తెరపైకి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.. అయితే, అధికార కూటమికి చెందిన అభ్యర్థి కొత్త రాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.. అధికార పార్టీకి ఎలక్ట్రోరల్ కాలేజీలో 48 శాతానికిపైగా మద్దతు ఉంది. దీంతో దాదాపు అధికారపార్టీ అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అజిత్ దోవల్.. భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేశారు.. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా.. ప్రధాని నరేంద్ర మోడీ టీమ్లో కీలకంగా ఉన్నారు.. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. 23 ఏళ్లకే ఐపీఎస్కు ఎంపికయ్యారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆపైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు దోవల్. ఇక, సర్వీసులో చేరిన నాలుగేళ్లకు ఇంటెలిజెన్స్ బ్యూరోకు మారారు దోవల్. అక్కడ పనిచేస్తూ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పీచమణిచే చర్యల్లో కీలకంగా పనిచేశారు.. తన సర్వీసులో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉండి సేవలు అందించారు.
రక్షణ రంగంలో వివిధ ఆపరేషన్లలో కీలక భూమిక పోషించిన అజిత్ దోవల్ను.. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా నియమించారు. . వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి ఎన్ఎస్ఏ అయిన దోవల్కి చేతల మనిషిగా గుర్తింపు ఉంది.. మటలు తక్కువగా మాట్లాడే ఆయన.. చేతల్లో చూపిస్తారని చెబుతుంటారు.. దోవల్ దెబ్బకే దావూద్ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడనీ చెబుతుంటారు.. రా, ఇంటెలిజెన్స్ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి. దాన్నిబట్టి ఎన్ఎస్ఏగా దోవల్ పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్లో ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు దోవల్.
ఇక, మణిపూర్లో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని తీవ్రవాదులు మట్టుబెట్టిన తర్వాత ప్రతీకారంగా వారాల వ్యవధిలో మన సైన్యం మయన్మార్లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. గత అక్టోబరులో మయన్మార్ ప్రభుత్వం అతివాద వర్గాలతో శాంతి ఒప్పందం చేసుకున్నపుడు దోవల్ అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు.. ఊరీ తీవ్రవాద దుశ్చర్య తర్వాత మొట్టమొదటిసారిగా భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను విజయవంతంగా జరిపాయి.. ఈ మెరుపు దాడుల వెనుక సూత్రధారిగా అజిత్ ధోవల్ ప్రధానపాత్ర పోషించారు. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి మరింత చేరువయ్యారు దోవల్.. మొత్తంగా ఇప్పుడ ఆయనను భారత రాష్ట్రపతిని చేసేందుకు అధికార పక్షం మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!