Ajit Doval: ‘‘పాకిస్తాన్ దాడి చేస్తే..’’ దాయాదికి అజిత్ దోవల్ వార్నింగ్..
- పాకిస్తాన్ దాడి చేస్తే, తీవ్ర ప్రతీకారం తప్పదు..
- దాయాదికి ఎన్ఏస్ఏ అజిత్ దోవల్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే, పాకిస్తాన్లోని మొత్తం 09 ఉగ్రస్థావరాలపై 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ప్రపంచదేశాలకు వివరించారు. భారతదేశానికి ఉద్రిక్తతల్ని పెంచే ఉద్దేశ్యం లేదని, ఒక వేళ పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మిత్ర దేశాలకు వెల్లడించారు.
Read Also: Operation Sindoor: శభాష్ భారత సైన్యం.. చిటికెడు సింధూరం ఎంత విలువైందో పాకిస్థాన్కు అర్థమైంది?
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎటాక్ చేసిన తర్వాత, అజిత్ దోవల్ యూకే, యూఎస్, సౌదీ అరేబియా, జపార్, రష్యా, ఫ్రాన్స్లతో మాట్లాడారు. తాము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, సామాన్య ప్రజలు, పాక్ ఆర్మీ ఆస్తులపై దాడులు నిర్వహించలేదని తెలిపారు. భారత్ తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానం గురించి దోవల్ తన సహచరులతో పంచుకున్నారు.
భారత్కు ఘర్షణను పెంచే ఉద్దేశ్యం లేదని, కానీ పాకిస్తాన్ తీవ్ర తరం చేయాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దోవల్ అమెరికా ఎన్ఎస్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యూకే జోనాథన్ పావెల్, సౌదీ అరేబియా ఎన్ఎస్ఏ ముసైద్ అల్ ఐబాన్, యూఏఈ అధికారి షేక్ తహ్నూన్, జపాన్ అధికారి మసటాకా ఒకానోలతో మాట్లాడారు. చైనా సీపీసీ సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఫ్రెంచ్ అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఇమ్మాన్యయేల్ బోనేతో మాట్లాడారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..