MiG-21: మిగ్-21 విమానాలను నిలిపేసిన ఐఏఎఫ్.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MiG-21: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) మిగ్-21 జెట్ ఫ్లీట్ ను నిలిపివేశాయి. మే 8న రాజస్థాన్ హనుమాన్ గఢ్ గ్రామంలో మిగ్ -21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. సూరత్గఢ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన మిగ్-21 సాంకేతిక కారణాలతో క్రాష్ అయింది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న ముగ్గురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధవిమానం సాధారణ శిక్షణలో ఉండగా.. ప్రమాదానికి గురైంది. పైలెట్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలు తెసుకునేందుకు విచారణ ప్రారంభం అయింది. దీనికి గల కారణాలపై పరిశోధన జరిగే వరకు మిగ్-21 ఎగరకుండా మొత్తం విమానాలను నిలిపేసింది.
Read Also: Assam: “నో జీన్స్, లెగ్గింగ్స్”.. గవర్నమెంట్ టీచర్లకు డ్రెస్ కోడ్..
Also Read
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
- Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
- IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
- PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
మిగ్-21 ఎయిర్క్రాఫ్ట్ వేరియంట్లు ఐదు దశాబ్దాలుగా భారత వైమానిక దళంలో పనిచేస్తున్నాయి. దశలవారీగా వీటిని తొలగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత ఐఏఎఫ్ కేవలం మూడు మిగ్-21 స్క్వాడ్రన్లు మాత్రమే పనిచేస్తున్నాయని, వీటన్నింటిని 2025 వరకు దశలవారీగా తొలగించనున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మూడు మిగ్-21 బైసన్ వేరియంట్లతో సహా 31 యుద్ధ విమాన స్క్వాడ్రన్లు ఉన్నాయి. మిగ్-21 విమానాలు 1960ల్లో ఐఏఎఫ్ లోకి చేర్చబడ్డాయి. మిగ్-21 విమానాలు ఇటీవల తరుచుగా క్రాష్ అవుతున్నాయి. వీటి వల్ల సుశిక్షుతులైన పైలెట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధునాతన మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు LCA మార్క్ 1A మరియు LCA మార్క్ 2లతో సహా స్వదేశీ విమానాలను వాయుసేనలోకి చేర్చుకోవాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!