BJP: ఇండియా కూటమి నేతలు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారు.. 5 ఉదాహరణలు వివరించిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఇండియా కూటమి నేతలు పాకిస్తాన్ స్వరాన్ని వినిపిస్తున్నాయని బీజేపీ దుయ్యబట్టింది. అలాంటి ద్రోహుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోమవారం బీజేపీ కోరింది. ఇండియా కూటమి నేతలు దేశప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల ఇండియా కూటమి పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడిన 5 సందర్భాలను బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ప్రస్తావించారు. తాజాగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని పెంచాయి. భారత్ పీఓకేని స్వాధీనం చేసుకుంటుందనే విషయంపై మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ గాజులు తొడుక్కుని లేదు, వారి వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి’’ అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళల్ని అవమానించడమే అని త్రివేది అన్నారు.
జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిపై ఉగ్రవాద దాడి ఎన్నికల స్టంట్ అని పంజాబ్ మాజీ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ వ్యాఖ్యానించడం, ముంబై దాడుల్లో అజ్మల్ కసబ్ ఐపీసఎస్ అధికారి హేమంత్ కర్కరేని చంపలేదని కాంగ్రెస్ నేత విజయ వాడెట్టివార్ చెప్పడం వంటి అంశాలను త్రివేది ఉహరించారు. భారత ప్రధాని నరేంద్రమోడీని విమర్శిస్తూ, పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీని పొడగటం, పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడటాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఇండియా కూటమి నేతలు పాక్ అనుకూల స్వరాన్ని వినిపిస్తున్నారని అన్నారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Lok Sabha Elections 2024: యానిమేటెడ్ వీడియో వివాదం.. జేడీ నడ్డా, అమిత్ మాల్వీయాపై కేసు నమోదు..
నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమైనవిగా త్రివేది వర్ణించారు. జరుగుతున్న లోక్సభ ఎన్నికలను విశ్లేషిస్తూ, మోడీని విమర్శిస్తూ బంగ్లాదేశ్లోని ఓ వార్తాపత్రికకు కాంగ్రెస్ నేత శశిథరూరన్ కాలమ్ రాశారని అన్నారు. భారత్లో ఎన్నికలు జరుగుతుంటే బంగ్లాదేశ్ ప్రజాభిప్రాయాన్ని పెంచుతున్నారని త్రివేది మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్ని కాంగ్రెస్ నాయకులు భారత పరిపాలనలో ఉన్న కాశ్మీర్ అని పేర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబై ఉగ్రదాడుల గురించి కాంగ్రెస్ నాయకుడు పాకిస్తాన్కి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నాడని, మరొకరు అణ్వాయుధాల గురించి మాట్లాడుతుంటే, ఇంకొకరు జవాన్ల బలిదానాలను అనుమానిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ముస్లింలీగ్ ముద్ర ఉందని మోడీ చెప్పారని, వారు మాట్లాడే ప్రతీ మాటలో పాకిస్తాన్ వైఖరి కనిపిస్తోందని చెప్పారు. దేశంలో అణు నిల్వల్ని తొలగించాలని వామపక్షాలు కోరుకుంటున్నాయని త్రివేది అన్నారు. ఈ నాయకులు ఎవరి చేతిలో ఉన్నారని ప్రశ్నిస్తూ, ద్రోహుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!