Bengaluru: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్.. చివరికి ఏమైందంటే..!
- విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్
- ప్రైవేట్ ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్
- రూ.లక్షల్లో లాక్కుకున్న టీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారో..? లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. వక్రమార్గం పడుతున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
ఆమె ఒక విద్యావంతురాలు. అంతేకాదు. ఒక స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలని అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. విద్యార్థి తండ్రితో ఎఫైర్ పెట్టుకుంది. అనంతరం బ్లాక్ మెయిల్కి దిగింది. రూ.లక్షల్లో డబ్బులు గుంజుంది. మరింత డబ్బు కోసం నీచానికి ఒడిగట్టింది. చివరికి పాపం పండి కటకటాల పాలైంది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
పోలీసుల కథనం ప్రకారం… 2023లో పశ్చిమ బెంగళూరు పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యాపారి తన భార్య, ముగ్గురు కుమార్తెలు, ఐదేళ్ల కొడుకును తీసుకుని ప్రీ-స్కూల్కు తీసుకెళ్లి చేరిపించారు. అడ్మిసన్ సమయంలో శ్రీదేవి రుడగి (25) అనే టీచర్… వ్యాపారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంది. అతడితో రోజు ఫోన్ మాట్లాడుతూ ప్రారంభించింది. అంతేకాకుండా మొబైల్ నెంబర్లు మార్చి.. ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టారు. సందేశాలు, వీడియో కాల్స్ చేసుకోవడం జరుగుతోంది. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా కలుసుకునేంత వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే వ్యాపారి నుంచి రూ.4లక్షలు బలవంతంగా శ్రీదేవి తీసుకుంది. జనవరిలో మరో రూ.15 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. అందుకు అతడు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ పరిణామంలోనే రూ.50వేలు అప్పుగా తీసుకునేందుకు నేరుగా వ్యాపారికి ఇంటికి వెళ్లింది. ఇక టీచర్ శ్రీదేవి టార్చర్ భరించలేక.. కుటుంబాన్ని గుజరాత్కు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు.
అయితే పిల్లల బదిలీ సర్టిఫికేట్ కోసమని మార్చి నెల ప్రారంభంలో వ్యాపారి స్కూల్కు వెళ్లాడు. నేరుగా శ్రీదేవి కార్యాలయంలోకి వెళ్లి చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న గణేష్ కాలే (38), సాగర్ (28) బెదిరింపులకు దిగారు. శ్రీదేవితో వ్యాపారి కలిసి ఉన్న ప్రైవేటు ఫొటోలను చూపించి బెదిరింపులకు దిగారు. రూ.20లక్షల ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామని టార్చర్ పెట్టారు. చేసేదేమీలేక రూ.15లక్షలు ఇచ్చేందుకు చర్చలు జరిపాడు. వెంటనే రూ.1.9లక్షలు బదిలీ చేశాడు. మిగతావి ఇవ్వాలంటూ మార్చి 17న శ్రీదేవి ఫోన్ చేసింది. మాజీ పోలీస్ అధికారికి రూ.5లక్షలు, సాగర్, కాలేకు రూ.లక్ష చొప్పున.. శ్రీదేవికి రూ.8లక్షలు పంపించాడు. ఇక ప్రాణం విసిగిన వ్యాపారి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీచర్ శ్రీదేవితో పాటు సాగర్, కాలేలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!