Bengaluru: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్.. చివరికి ఏమైందంటే..!
- విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్
- ప్రైవేట్ ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్
- రూ.లక్షల్లో లాక్కుకున్న టీచర్
పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారో..? లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. వక్రమార్గం పడుతున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
ఆమె ఒక విద్యావంతురాలు. అంతేకాదు. ఒక స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలని అనుకుందో.. ఏమో తెలియదు గానీ.. విద్యార్థి తండ్రితో ఎఫైర్ పెట్టుకుంది. అనంతరం బ్లాక్ మెయిల్కి దిగింది. రూ.లక్షల్లో డబ్బులు గుంజుంది. మరింత డబ్బు కోసం నీచానికి ఒడిగట్టింది. చివరికి పాపం పండి కటకటాల పాలైంది.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
పోలీసుల కథనం ప్రకారం… 2023లో పశ్చిమ బెంగళూరు పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యాపారి తన భార్య, ముగ్గురు కుమార్తెలు, ఐదేళ్ల కొడుకును తీసుకుని ప్రీ-స్కూల్కు తీసుకెళ్లి చేరిపించారు. అడ్మిసన్ సమయంలో శ్రీదేవి రుడగి (25) అనే టీచర్… వ్యాపారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంది. అతడితో రోజు ఫోన్ మాట్లాడుతూ ప్రారంభించింది. అంతేకాకుండా మొబైల్ నెంబర్లు మార్చి.. ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టారు. సందేశాలు, వీడియో కాల్స్ చేసుకోవడం జరుగుతోంది. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా కలుసుకునేంత వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే వ్యాపారి నుంచి రూ.4లక్షలు బలవంతంగా శ్రీదేవి తీసుకుంది. జనవరిలో మరో రూ.15 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. అందుకు అతడు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ పరిణామంలోనే రూ.50వేలు అప్పుగా తీసుకునేందుకు నేరుగా వ్యాపారికి ఇంటికి వెళ్లింది. ఇక టీచర్ శ్రీదేవి టార్చర్ భరించలేక.. కుటుంబాన్ని గుజరాత్కు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు.
అయితే పిల్లల బదిలీ సర్టిఫికేట్ కోసమని మార్చి నెల ప్రారంభంలో వ్యాపారి స్కూల్కు వెళ్లాడు. నేరుగా శ్రీదేవి కార్యాలయంలోకి వెళ్లి చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న గణేష్ కాలే (38), సాగర్ (28) బెదిరింపులకు దిగారు. శ్రీదేవితో వ్యాపారి కలిసి ఉన్న ప్రైవేటు ఫొటోలను చూపించి బెదిరింపులకు దిగారు. రూ.20లక్షల ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామని టార్చర్ పెట్టారు. చేసేదేమీలేక రూ.15లక్షలు ఇచ్చేందుకు చర్చలు జరిపాడు. వెంటనే రూ.1.9లక్షలు బదిలీ చేశాడు. మిగతావి ఇవ్వాలంటూ మార్చి 17న శ్రీదేవి ఫోన్ చేసింది. మాజీ పోలీస్ అధికారికి రూ.5లక్షలు, సాగర్, కాలేకు రూ.లక్ష చొప్పున.. శ్రీదేవికి రూ.8లక్షలు పంపించాడు. ఇక ప్రాణం విసిగిన వ్యాపారి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీచర్ శ్రీదేవితో పాటు సాగర్, కాలేలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!