Yogi Adityanath: “హోలీ వర్సెస్ శుక్రవారం నమాజ్”.. పోలీస్ అధికారికి యోగి మద్దతు..
- ఉత్తర్ ప్రదేశ్లో హోలీ వర్సెస్ శుక్రవారం నమాజ్..
- హోలీ వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారికి సీఎం యోగి మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పోలీస్ అధికారి హోలీ, శుక్రవారం నమాజ్ గురించి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, ఆ పోలీస్ అధికారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మద్దతుగా నిలిచారు. అధికారి వ్యాఖ్యల్ని సీఎం యోగి సమర్థించారు. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది. కానీ శుక్రవారం నమాజ్ ప్రతీ వారం ఉంటుంది. ఒక వ్యక్తి మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఒకవేళ వెళ్లాల్సి వస్తే అతడికి రంగులతో సమస్య ఉండకూడదు’’ అని సంభాల్ సర్కిల్ ఆఫీసర్ అనూజ్ చౌదరి అన్నారు.
ఈ వ్యాఖ్యల చుట్టూ వివాదం చెలరేగింది. గురువారం, సంభాల్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో జరిగిన శాంతి కమిటీ సమావేశం తర్వాత చౌదరి విలేకరులతో మాట్లాడుతూ హోలీలో పాల్గొనడానికి ఇష్టపడని వారు ఇంటి లోపలే ఉండాలని సూచించారు. ‘‘హోలీ అనేది ఏడాదికి ఒకసారి వస్తుంది, అయితే శుక్రవారం నమాజ్ ఏడాదికి 52 సార్లు జరుగుతాయి. హోలీ రంగులతో ఎవరైనా అసౌకర్యంగా భావిస్తే, ఆ రోజు వారు ఇంటి లోపలే ఉండాలి. బయటకు వచ్చే వారికి విశాల దృక్పథం ఉండాలి’’ అని ఆయన అన్నారు.
Also Read
Read Also: Alawites: అలవైట్లు ఎవరు..? సిరియాలో ఎందుకు వీరిని వేటాడి చంపుతున్నారు..
పోలీస్ అధికారి వ్యాఖ్యలపై ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో సీఎం యోగి స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నమాజ్ నిర్వహించడానికి అంగీకరించినందుకు మత నాయకులకు ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సహజంగానే శుక్రవారం ప్రార్థనలు ప్రతీ శుక్రవారం జరుగుతాయి, హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. దీనిని ఆయన ప్రేమతో వివరించారు’’ అని సీఎం అన్నారు. ముందుగా ప్రార్థనలు చేయాలనుకునేవారు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవచ్చు, మసీదులను సందర్శించేవారు హోలీ వేడుకలను గుర్తుంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది హోలీ, శుక్రవారం నమాజ్ ఒకే రోజు వస్తున్నాయి.
అయితే, పోలీస్ అధికారి వ్యాఖ్యలపై సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి శర్వేంద్ర బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు సంపాదించుకోవడానికి అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. అధికారులు బీజేపీ ఏజెంట్లుగా వ్యవహరించవద్దు’’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ వైస్ చైర్మన్ మనీష్ హింద్వి మాట్లాడుతూ, “ఒక అధికారి, వారు ఎవరైనా, లౌకికంగా ఉండాలి. అప్పుడే ఈ దేశంలో పాలన సరిగ్గా పనిచేయగలదు. లేకుంటే, అది అరాచకానికి దారి తీస్తుంది.” అని చెప్పారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!