Godhra Riots: గోద్రా అల్లర్ల కేసులో నిందితుడికి జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలాయి 2002లో గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లు. ఈ అల్లర్ల చుట్టూ రాజకీయం ఇన్నేళ్లయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయోధ్య నుంచి వస్తున్న 59 మంది కరసేవకులను ఉన్న రైలు బోగీని కాల్చేయడంతో వారంత మరణించారు. ఈ ఘటన ఫిబ్రవరి, 2002లో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం గుజరాత్ వ్యాప్తంగా మతకలహాలు జరిగాయి.
తాజాగా గోద్రా అల్లర్ల కేసులో నిందితుడు రఫిక్ బతుక్ జీవిత ఖైదు విధించించారు పంచమహల్ లోని గోద్రా అదనపు సెషన్స్ న్యాయమూర్తి. తప్పించుకు తిరుగుతున్న బతుక్ ను ఫిబ్రవరి 2021లో పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం రఫిక్ బతుక్ పై విచారణ ప్రారంభం అయింది. తాజాగా శనివారం జీవిత ఖైదు విధించింది కోర్టు.
Also Read
Read Also: Dalitha Bandhu: ‘దళితబంధు’కి కౌంటర్గా బీజేపీ దళితాతిథ్యం?
ఫిబ్రవరి 27,2002లో కరసేవకులు ప్రయాణిస్తున్న రైలుకు నిప్పు పెట్టిన కేసులో రఫిక్ బతుక్ ప్రమేయం కూడా ఉందని కోర్ట్ విశ్వసించింది. ఇప్పటి వరకు రఫిక్ బతుక్ తో పాటు ఈ కేసులో 35 మందిని కోర్టు దోషులుగా నిర్థారించింది. గోద్రా అల్లర్ల తరువాత గుజరాత్ లో మతకల్లోలాలు చెలరేగాయి. ఈ అల్లర్లలో దాదాపుగా 1200 మంది మరణించారు.
గతంలో ఈ కేసులో 31 మందిని దోషులుగా నిర్థారించింది ప్రత్యేక సిట్ కోర్టు. మార్చి 1, 2011న కోర్టు 11 మందికి మరణశిక్ష విధించడంతో పాటు 20 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే 2017లో గుజరాత్ హైకోర్ట్ 11 మందికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. దీని తర్వాత మరో ముగ్గురు నిందితులకు కోర్టులు జీవిత ఖైదు విధించింది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!