Delhi Elections: గతంలో బీజేపీ ఏం చేసిందో తెలిసిందే.. ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న ఆప్
- అభ్యర్థుల కొనుగోలు వ్యవహారంపై ఆప్ ఆరోపణలు
- ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న సంజయ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఫలితాలకు ముందు అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం వేస్తోందని.. 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేశారని కేజ్రీవాల్, సంజయ్ సింగ్ సంచలన ఆరోపణల చేశారు. ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని బేరం చేశారని.. అంతేకాకుండా మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలను పరిశీలించాలంటూ ఏసీబీ అధికారులకు ఎల్జీ వీకే.సక్సేనా ఆదేశించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇది కూడా చదవండి: Infosys: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికిపై వేటు..
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజాగా ఇదే అంశంపై శుక్రవారం ఆప్ సీనియ్ నేత సంజయ్ సింగ్ స్పందించారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీజేపీ అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ ఎప్పుడూ ఇతర పార్టీలను విచ్ఛన్నం చేయాలని చూస్తుంటుందని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ల్లో ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూల్చిందో అందరికీ తెలిసిందేనన్నారు. ఆరోపణలపై ఫిర్యాదు చేసి కచ్చితంగా విచారణ కోరతామని స్పష్టం చేశారు. మేము ఆరోపణలు చేశాక.. బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా.. ఢిల్లీ ఎల్జీ వీకే.సక్సేనాను కలిశారు. అనంతరం ఏసీబీకి ఎల్జీ లేఖ రాశారన్నారు. ఆప్ కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. కొనుగోలుపై విచారణ కోరతామన్నారు. బీజేపీ నాయకులు సంప్రదించిన.. ఆప్ నాయకుడి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరిగింది. 60 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. రేపే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "BJP is the most corrupt party in the country. BJP always believes in breaking other parties…BJP toppled governments in Maharashtra, Karnataka, Madhya Pradesh, Uttarakhand, Arunachal Pradesh. Do we need a certificate from them that they… pic.twitter.com/CVrpfWPrBU
— ANI (@ANI) February 7, 2025
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?