Delhi Elections: గతంలో బీజేపీ ఏం చేసిందో తెలిసిందే.. ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న ఆప్
- అభ్యర్థుల కొనుగోలు వ్యవహారంపై ఆప్ ఆరోపణలు
- ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న సంజయ్ సింగ్
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఫలితాలకు ముందు అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం వేస్తోందని.. 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేశారని కేజ్రీవాల్, సంజయ్ సింగ్ సంచలన ఆరోపణల చేశారు. ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని బేరం చేశారని.. అంతేకాకుండా మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలను పరిశీలించాలంటూ ఏసీబీ అధికారులకు ఎల్జీ వీకే.సక్సేనా ఆదేశించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇది కూడా చదవండి: Infosys: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికిపై వేటు..
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
తాజాగా ఇదే అంశంపై శుక్రవారం ఆప్ సీనియ్ నేత సంజయ్ సింగ్ స్పందించారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీజేపీ అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ ఎప్పుడూ ఇతర పార్టీలను విచ్ఛన్నం చేయాలని చూస్తుంటుందని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ల్లో ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూల్చిందో అందరికీ తెలిసిందేనన్నారు. ఆరోపణలపై ఫిర్యాదు చేసి కచ్చితంగా విచారణ కోరతామని స్పష్టం చేశారు. మేము ఆరోపణలు చేశాక.. బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా.. ఢిల్లీ ఎల్జీ వీకే.సక్సేనాను కలిశారు. అనంతరం ఏసీబీకి ఎల్జీ లేఖ రాశారన్నారు. ఆప్ కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. కొనుగోలుపై విచారణ కోరతామన్నారు. బీజేపీ నాయకులు సంప్రదించిన.. ఆప్ నాయకుడి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరిగింది. 60 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. రేపే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "BJP is the most corrupt party in the country. BJP always believes in breaking other parties…BJP toppled governments in Maharashtra, Karnataka, Madhya Pradesh, Uttarakhand, Arunachal Pradesh. Do we need a certificate from them that they… pic.twitter.com/CVrpfWPrBU
— ANI (@ANI) February 7, 2025
తాజావార్తలు
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!