Yogi Adityanath: “సనాతన ధర్మాన్ని” తిట్టడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: సనాతన ధర్మాన్ని దూషించడం, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి ఉనికిని ప్రశ్నించడం ప్రతిపక్ష నేతలకు ఫ్యాషన్గా మారిందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అన్నారు. సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీ మద్దతుదారులు రామభక్తులపై కాల్పులు జరిపారని, ఉగ్రవాదులకు హారతి ఇస్తున్నారని ఆయన విమర్శించారు. నేరస్తులపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ, ప్రతిపక్ష పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు శ్రీరామ భక్తుల మరనాన్ని జరుపుకుంటాయి, గ్యాంగ్స్టర్ మరణానికి మొసలి కన్నీరు కారుస్తాయని ఆయన ఆరోపించారు.
Read Also: Worldcup jersey: ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో టీమిండియా జెర్సీ.. ధరలు ఇలా..
Also Read
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
సగానికి పైగా లోక్సభ స్థానాల్లో ఎన్నికలు ముగిశాయని, దేశం మొత్తం‘‘ఆబ్కీ బార్ 400 పార్’’ నినాదం ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. రాముడు, కృష్ణుడిని అవమానించే వారికి సరైన స్థానాన్ని చూపించేందుకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ‘‘రాముడు మరియు కృష్ణుడి గురించి ప్రశ్నలు లేవనెత్తే వారిని మనం ఎలా అంగీకరించగలం? అంతిమంగా, దేశ ప్రజలే వారి ఓట్ల ద్వారా సమాధానం ఇస్తారు’’ అని చెప్పారు.
సీతాపూర్లోని పుణ్యక్షేత్రమైన నైమిశారణ్య అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అయోధ్య పునరుజ్జీవం పొందినట్లే నైమిశారణ్య కూడా పరివర్తన చెందుతోందని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎస్పీ యువతకు పిస్టల్స్, ఆయుధాలు అందిస్తే తాము మాత్రం ట్యాబ్లు అందిస్తున్నామని యోగి చెప్పారు. భారత విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ ఆకలితో అలమటిస్తోందని, అక్కడ కిలో పిడి కోసం పోరాటాలు జరుగుతున్నాయని, భారత్లో మాత్రం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని వెల్లడించారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదలకు మద్దతుగా నిలుస్తారని, వారికి చికిత్స అవసరమైన ప్రభుత్వ సౌకర్యాలు, ఆర్థిక సాయం అందేలా చూస్తున్నారని చెప్పారు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..