AAP: ఆప్కి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆ పార్టీ ఏకైక లోక్సభ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడంతో ఇబ్బందుల్లో పడిండి. లోక్సభ ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ కావడంతో ఆప్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే ఆప్కి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ తరుపున లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ తాజాగా బీజేపీలో చేరారు. ఎంపీ సుశీల్ రింకూ ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాయలంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రింకూ 2023 జలంధర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. ప్రస్తుతం రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో జలంధర్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగుతారని తెలుస్తోంది.
Read Also: Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేపై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
543 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్లో రింకూ ఆప్ పార్టీ తరుపున ఉన్న ఒకే ఒక ఎంపీ. పంజాబ్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా జలంధర్ కోసం తాను బీజేపీలో చేరానని, అభివృద్ధి కార్యక్రమాలను ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. అంతముందు రోజు మంగళవారం లూథియానా ఎంపీ, కాంగ్రెస్ నేత రవ్నీత్ సింగ్ బిట్టు కూడా బీజేపీలో చేరారు. మిస్టర్ బిట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు. రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిలబడిని సిక్కు నేతల్లో బియాంత్ సింగ్ చాలా ప్రముఖుడు. పదవిలో ఉండగా ఉగ్రవాద దాడిలో ఆయన హత్యకు గురయ్యారు. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు 2024 లోక్సభ ఎన్నికల్లో ఏడవ మరియు చివరి దశ అయిన జూన్ 1న పోలింగ్ జరగనుంది.
MP Sushil Kumar Rinku & Punjab MLA Sheetal Angural join the BJP at party headquarters in Delhi. https://t.co/e8DYOT2WSX
— BJP (@BJP4India) March 27, 2024
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!