AAP: ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ని తీసేయాలి.. కాంగ్రెస్కి ఆప్ 24 గంటల అల్టిమేటం..
- ఇండియా కూటమిలో విభేదాలు..
- ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్ వర్సెస్ కాంగ్రెస్..
- కాంగ్రెస్ని కూటమి నుంచి తొలగించాలని డిమాండ్..
- అజయ్ మాకెన్ని పార్టీ నుంచి తొలగించాలని ఆప్ అల్టిమేటం..
AAP: ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగునున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ ఆప్, అరవింద్ కేజ్రీవాల్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అజయ్ మాకెన్ని 24 గంటల్లో తొలగించాలని ఆప్ అల్టిమేటం విధించింది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ని తొలగించాలని ఇతర పార్టీలను కోరుతామని ఆప్ నేతలు చెప్పారు.
ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీకి సాయం చేస్తుందని ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇలాంటి ఆరోపనలే చేశారు. ‘బీజేపీకి ఎన్నికల్లో లాభం చేకూరేందుకు కాంగ్రెస్ అన్నీ చేస్తోంది. అజయ్ మాకెన్ బీజేపీ స్ర్కిప్ట్ చదవి, బీజేపీ ఆదేశాల మేరకు ప్రకటన చేస్తూ, బీజేపీ సూచనల మేరకు ఆప్ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. నిన్న అన్ని హద్దులు దాటి మా నేత అరవింద్ కేజ్రీవాల్ని దేశవ్యతిరేకిగా విమర్శించారు’’ అని సంజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ లేదా దాని నాయకులు ఏ బీజేపీ నేతలని కూడా యాంటీ-నేషనల్ అని పిలువలేదని చెప్పారు.
Also Read
- West Bengal polls: బీజేపీ గుర్తు కనిపించకుండా ఈవీఎంలపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read Also: Jani Master: పోలీసుల ఛార్జ్ షీట్.. జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే..!
ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్-కాంగ్రెస్, కొన్ని నెలల్లోనే ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ చేతిలో కూటమి ఓటమి పాలైంది. ఏడు నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. చండీగఢ్లో కూడా కాంగ్రెస్కు ప్రచారం చేశారు. పార్లమెంటులో సమస్యలపై ఆప్ పదేపదే కాంగ్రెస్తో నిలుస్తుంది.మీరు మా నాయకుడిని దేశవిరోధి అంటారు, యూత్ కాంగ్రెస్ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందా?’’ అంటూ సంజయ్ సింగ్ ప్రశ్నించారు.
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ అంగీకరించలేదనే విషయాన్ని ఆప్ నేత గుర్తు చయేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టు8కుంటున్నట్లు కాంగ్రెస్ చర్యలు మాటలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అతిషీ అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేసిందా..? అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో కాలుష్యం, ప్రజలకు సదుపాయాలు, శాంతిభద్రతలపై ఆప్ని లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ బీజేపీ నిన్న 12 పాయింట్లతో శ్వేతపత్రం విడుదల చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. దేశంలో ఎవరైనా మోసాలకు రారాజు ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్ అంటూ అజయ్ మాకెన్ విమర్శించారు.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తు కనిపించకుండా ఈవీఎంలపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో