బీజేపీపై సంచలన ఆరోపణలు.. కేబినెట్లో చోటు, డబ్బు ఇస్తామని ప్రలోభాలు..!
రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వలసపోవడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది.. అయితే, దీని వెనుక ప్రలోభాలు, బెదిరింపులు.. ఇలా ఒక్కటేంటి.. అనేక కారణాలతో నేతల పార్టీ కండువా మారిపోయిన సందర్భాలున్నాయి.. ఇక, అధికారంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం.. పదవులు, డబ్బు ఎర వేయడం వింటుంటాం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఇది ప్రారంభం అయిపోయిందని తెలుస్తోంది.. దీనికి కారణం ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్.. తాజాగా బీజేపీపై సంచలన ఆరోపణలు చేయడమే.
Read Also: వైసీపీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం.. ఆ ఘనత జగన్దే..!
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
భారతీయ జనతా పార్టీలో చేరాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపిన ఎంపీ భగవంత్ మాన్… బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశచూపారని, అంతే కాదు కేంద్ర కేబినెట్లో చోటు కూడా కల్పిస్తామని చెప్పారంటూ ఆరోపణలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన భగవంత్ మాన్.. బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత.. నాతో మాట్లాడారు… పార్టీలో చేరేందుకు మీకు ఏం కావాలి? డబ్బులేమైనా కావాలా? మా పార్టీలోకి వస్తే కేంద్ర కేబినెట్లో కావల్సిన పోస్టు ఇస్తామని ఆయన తనను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు.. ఇక, సమయం వచ్చినప్పుడు సదరు బీజేపీ నేత పేరును కూడా బయటపెడతానన్న ఆయన.. పంజాబ్లోని ఆప్ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ నేతలు గాలం వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డ ఆయన.. తాను ఎవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. కాగా, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్ని అంతర్గ విభేదాలతో సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్సింగ్.. కొత్త పార్టీ పెట్టి.. బీజేపీతో పొత్తుకు సిద్ధం అయ్యారు. మరోవైపు.. పంజాబ్పై ఆమ్ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు వాగ్ధానాలు చేశారు పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇక, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీంతో.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!