Swati Maliwal: సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆప్ నేత స్వాతి మలివాల్పై దాడి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతి మలివాల్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రావాల్ నివాసంలో దాడి జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తనను తాను స్వాలి మలివాల్గా చెప్పుకుంటూ ఓ మహిళ నుంచి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూం(పీసీఆర్)కి కాల్స్ వెళ్లాయి. ఈ రెండు కూడా సివిల్ లైన్స్లోని సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి వచ్చినట్లు సమాచారం. దాడికి గురైన తర్వాత అత్యవసర సేవల కోసం ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Maldives: భారత్ ఇచ్చిన విమానాలను మా పైలట్లు నడపలేరు.. మాల్దీవుల రక్షణ మంత్రి కామెంట్స్..
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
పోలీస్ వర్గాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు కాల్ వచ్చింది. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా స్వాతి మలివాల్ కనిపించలేదు. ప్రోటోకాల్ ప్రకారం, చట్టాన్ని అమలు చేసే అధికారులు సరైన అనుమతి లేకుండా ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించలేదు. ఢిల్లీ పోలీసులు పీసీఆర్ కాల్ వాస్తవికతను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) తనపై సోమవారం దాడి చేశారని రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న స్వాలి మలివాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసంలో పీఏ విభవ్ కుమార్ కొట్టారని ఢిల్లీ మహిళా కమిషర్ మాజీ చైర్పర్సన్ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ విరుచుకుపడుతోంది. మలివాల్పై దాడి ఆరోపణపై ఆప్పై ధ్వజమెత్తింది. పార్టీ అధినేత కేజ్రీవాల్ మలివాల్ మౌనం వహించారని అన్నారు. బీజేపీ నేత అమిత్ మాల్వియా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ సీఎం పీఏ తనపై దాడి చేశారని ఆప్ ఆర్ఎస్ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం ఇంటి నుంచి కాల్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టుపై స్వాతి మలివాల్ రేడియో మౌనం వహించారని గుర్తుంచుకోండి. ఆమె నిజానికి ఆ సమయంలో భారతదేశంలో కూడా లేదు మరియు చాలా కాలం వరకు తిరిగి రాలేదు’’ అని ట్వీట్ చేశారు.
బీజేపీ మరో నేత కపిల్ మిశ్రా ఎక్స్ వేదికగా ఆప్ని ప్రశ్నించారు. ‘‘కేజ్రీవాల్ పీఏ స్వాలి మలివాల్ని కొట్టారా..? ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై స్పష్టత ఇస్తుందా..? ముఖ్యమంత్రి ఇంట్లో రాజ్యసభ మహిళా ఎంపీని కొట్టారనే వార్తలు అవాస్తవం కావాలని దేవుడిని ప్రార్థిస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!