Swati Maliwal: సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆప్ నేత స్వాతి మలివాల్పై దాడి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతి మలివాల్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రావాల్ నివాసంలో దాడి జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తనను తాను స్వాలి మలివాల్గా చెప్పుకుంటూ ఓ మహిళ నుంచి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూం(పీసీఆర్)కి కాల్స్ వెళ్లాయి. ఈ రెండు కూడా సివిల్ లైన్స్లోని సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి వచ్చినట్లు సమాచారం. దాడికి గురైన తర్వాత అత్యవసర సేవల కోసం ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Maldives: భారత్ ఇచ్చిన విమానాలను మా పైలట్లు నడపలేరు.. మాల్దీవుల రక్షణ మంత్రి కామెంట్స్..
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
పోలీస్ వర్గాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు కాల్ వచ్చింది. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా స్వాతి మలివాల్ కనిపించలేదు. ప్రోటోకాల్ ప్రకారం, చట్టాన్ని అమలు చేసే అధికారులు సరైన అనుమతి లేకుండా ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించలేదు. ఢిల్లీ పోలీసులు పీసీఆర్ కాల్ వాస్తవికతను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) తనపై సోమవారం దాడి చేశారని రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న స్వాలి మలివాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసంలో పీఏ విభవ్ కుమార్ కొట్టారని ఢిల్లీ మహిళా కమిషర్ మాజీ చైర్పర్సన్ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ విరుచుకుపడుతోంది. మలివాల్పై దాడి ఆరోపణపై ఆప్పై ధ్వజమెత్తింది. పార్టీ అధినేత కేజ్రీవాల్ మలివాల్ మౌనం వహించారని అన్నారు. బీజేపీ నేత అమిత్ మాల్వియా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ సీఎం పీఏ తనపై దాడి చేశారని ఆప్ ఆర్ఎస్ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం ఇంటి నుంచి కాల్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టుపై స్వాతి మలివాల్ రేడియో మౌనం వహించారని గుర్తుంచుకోండి. ఆమె నిజానికి ఆ సమయంలో భారతదేశంలో కూడా లేదు మరియు చాలా కాలం వరకు తిరిగి రాలేదు’’ అని ట్వీట్ చేశారు.
బీజేపీ మరో నేత కపిల్ మిశ్రా ఎక్స్ వేదికగా ఆప్ని ప్రశ్నించారు. ‘‘కేజ్రీవాల్ పీఏ స్వాలి మలివాల్ని కొట్టారా..? ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై స్పష్టత ఇస్తుందా..? ముఖ్యమంత్రి ఇంట్లో రాజ్యసభ మహిళా ఎంపీని కొట్టారనే వార్తలు అవాస్తవం కావాలని దేవుడిని ప్రార్థిస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!