MP Sanjay Singh: ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాన్ని వారంలో ఖాళీ చేయనున్న కేజ్రీవాల్..
- అరవింద్ కేజ్రీవాల్ ఒక వారంలో తన బంగ్లాను ఖాళీ చేస్తారు..
- కేజ్రీవాల్ భద్రత గురించి ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది..
- ఢిల్లీ మాజీ సీఎం ప్రజలతో కలిసి జీవిస్తాడు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Sanjay Singh: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేస్తారని.. ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకుంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈరోజు (బుధవారం) తెలిపారు. తన అధికారిక నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత కేజ్రీవాల్, అతని కుటుంబం ఢిల్లీలోనే ఉంటారని చెప్పుకొచ్చారు. వారికి తగిన వసతి కోసం అన్వేషణ జరుగుతోందని ఆప్ ఎంపీ చెప్పుకొచ్చారు. ఇక, మేము కేజ్రీవాల్ భద్రత గురించి ఆందోళన చెందుతున్నాము.. భద్రతా కోణంలో ఇప్పుడు ఉన్న ఇల్లు ముఖ్యమైంది.. కానీ అతను దానిని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నాడు.. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలతో కలిసి జీవిస్తాడని ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: MSME Policy: ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ఇక, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు అని ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ను అవినీతిపరుడని, ఆయన నిజాయితీని ప్రశ్నిస్తూ గత రెండేళ్లుగా బీజేపీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది మండిపడ్డారు. బెయిల్ పొందడం దాదాపు అసాధ్యమైన సందర్భంలో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అన్నారు. కాగా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారి అరవింద్ కేజ్రీవాల్కు మద్యం పాలసీ స్కామ్తో సంబంధం ఉన్న కేసులో ఈ నెల ప్రారంభంలో అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబరు 17న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే, ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీలో అధికారం దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తుంది.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!