MP Sanjay Singh: ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాన్ని వారంలో ఖాళీ చేయనున్న కేజ్రీవాల్..
- అరవింద్ కేజ్రీవాల్ ఒక వారంలో తన బంగ్లాను ఖాళీ చేస్తారు..
- కేజ్రీవాల్ భద్రత గురించి ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది..
- ఢిల్లీ మాజీ సీఎం ప్రజలతో కలిసి జీవిస్తాడు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
MP Sanjay Singh: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేస్తారని.. ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకుంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈరోజు (బుధవారం) తెలిపారు. తన అధికారిక నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత కేజ్రీవాల్, అతని కుటుంబం ఢిల్లీలోనే ఉంటారని చెప్పుకొచ్చారు. వారికి తగిన వసతి కోసం అన్వేషణ జరుగుతోందని ఆప్ ఎంపీ చెప్పుకొచ్చారు. ఇక, మేము కేజ్రీవాల్ భద్రత గురించి ఆందోళన చెందుతున్నాము.. భద్రతా కోణంలో ఇప్పుడు ఉన్న ఇల్లు ముఖ్యమైంది.. కానీ అతను దానిని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నాడు.. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలతో కలిసి జీవిస్తాడని ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: MSME Policy: ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
ఇక, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు అని ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ను అవినీతిపరుడని, ఆయన నిజాయితీని ప్రశ్నిస్తూ గత రెండేళ్లుగా బీజేపీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది మండిపడ్డారు. బెయిల్ పొందడం దాదాపు అసాధ్యమైన సందర్భంలో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అన్నారు. కాగా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారి అరవింద్ కేజ్రీవాల్కు మద్యం పాలసీ స్కామ్తో సంబంధం ఉన్న కేసులో ఈ నెల ప్రారంభంలో అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబరు 17న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే, ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీలో అధికారం దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తుంది.
తాజావార్తలు
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!