Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
- భారత్లో త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైళ్లు
- డిసెంబర్ 2024లో ట్రయల్ రన్
- జర్మనీ.. ఫ్రాన్స్.. స్వీడన్.. చైనాలో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో హైడ్రోజన్తో నడిచే రైళ్లు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో.. జర్మనీకి చెందిన TUV-SUD రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది. ఈ రైలు ట్రయల్ రన్ డిసెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా ఈ జాబితాలో చేరనుంది.
హైడ్రోజన్ రైలు ఒక్క యూనిట్ ఖరీదు రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రైల్వే మొదట 35 రైళ్లను నడపనుంది. ఒక్కో రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుంది. దీని గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సిద్ధం చేయడానికి రూ.70 కోట్లు వెచ్చించనున్నారు. సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ బ్యాటరీ, రెండు ఇంధన యూనిట్లను విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలును మొదట జింద్-సోనిపట్ సెక్షన్లో నడపనున్నట్లు సమాచారం. హర్యానాలోని రైళ్లకు హైడ్రోజన్ జింద్లో ఉన్న 1 MW పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెమ్బ్రేన్ ఎలక్ట్రోలైజర్ నుండి అందించబడుతుంది. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 430 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కూడా ఉంటుంది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Read Also: Boat Capsizes: పడవ బోల్తా.. 78 మంది మృతి!
ప్రత్యేకత ఏమిటి
హైడ్రోజన్ రైలు హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుంది. ఇందులో ఇంజన్ స్థానంలో హైడ్రోజన్ ఇంధన కణాలు అమర్చబడి ఉంటాయి. ఈ రైళ్లు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ లేదా పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలను విడుదల చేయవు. దీని వల్ల కాలుష్యం ఉండదు. హైడ్రోజన్ ఇంధన కణాల సహాయంతో, హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. ఈ రైలును హైడ్రైల్ అని కూడా అంటారు. ఈ రైలులో నాలుగు కోచ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. నీలగిరి మౌంటైన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై మరియు మార్వార్ దేవ్గర్ మదారియా మార్గాల్లో ఈ రైలును నడపడానికి ప్రణాళిక ఉంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలు కారుపాతల, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతోంది.
డీజిల్ రైలుతో పోలిస్తే ఈ రైలు నడపడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే.. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. గ్రీన్ హైడ్రోజన్ కిలోకు దాదాపు రూ.492 ఉంటుంది. ఈ రైలు నిర్వహణ డీజిల్ రైలు కంటే 27 శాతం ఖర్చుతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెంచి కంపెనీ తొలిసారిగా హైడ్రోజన్ రైలును సిద్ధం చేసింది. 2018 నుంచి అక్కడ హైడ్రోజన్ రైలు నడుస్తోంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..