Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
- భారత్లో త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైళ్లు
- డిసెంబర్ 2024లో ట్రయల్ రన్
- జర్మనీ.. ఫ్రాన్స్.. స్వీడన్.. చైనాలో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో హైడ్రోజన్తో నడిచే రైళ్లు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో.. జర్మనీకి చెందిన TUV-SUD రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది. ఈ రైలు ట్రయల్ రన్ డిసెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా ఈ జాబితాలో చేరనుంది.
హైడ్రోజన్ రైలు ఒక్క యూనిట్ ఖరీదు రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రైల్వే మొదట 35 రైళ్లను నడపనుంది. ఒక్కో రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుంది. దీని గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సిద్ధం చేయడానికి రూ.70 కోట్లు వెచ్చించనున్నారు. సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ బ్యాటరీ, రెండు ఇంధన యూనిట్లను విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలును మొదట జింద్-సోనిపట్ సెక్షన్లో నడపనున్నట్లు సమాచారం. హర్యానాలోని రైళ్లకు హైడ్రోజన్ జింద్లో ఉన్న 1 MW పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెమ్బ్రేన్ ఎలక్ట్రోలైజర్ నుండి అందించబడుతుంది. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 430 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కూడా ఉంటుంది.
Also Read
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
Read Also: Boat Capsizes: పడవ బోల్తా.. 78 మంది మృతి!
ప్రత్యేకత ఏమిటి
హైడ్రోజన్ రైలు హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుంది. ఇందులో ఇంజన్ స్థానంలో హైడ్రోజన్ ఇంధన కణాలు అమర్చబడి ఉంటాయి. ఈ రైళ్లు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ లేదా పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలను విడుదల చేయవు. దీని వల్ల కాలుష్యం ఉండదు. హైడ్రోజన్ ఇంధన కణాల సహాయంతో, హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. ఈ రైలును హైడ్రైల్ అని కూడా అంటారు. ఈ రైలులో నాలుగు కోచ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. నీలగిరి మౌంటైన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై మరియు మార్వార్ దేవ్గర్ మదారియా మార్గాల్లో ఈ రైలును నడపడానికి ప్రణాళిక ఉంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలు కారుపాతల, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతోంది.
డీజిల్ రైలుతో పోలిస్తే ఈ రైలు నడపడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే.. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. గ్రీన్ హైడ్రోజన్ కిలోకు దాదాపు రూ.492 ఉంటుంది. ఈ రైలు నిర్వహణ డీజిల్ రైలు కంటే 27 శాతం ఖర్చుతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెంచి కంపెనీ తొలిసారిగా హైడ్రోజన్ రైలును సిద్ధం చేసింది. 2018 నుంచి అక్కడ హైడ్రోజన్ రైలు నడుస్తోంది.
తాజావార్తలు
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!