Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
- భారత్లో త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైళ్లు
- డిసెంబర్ 2024లో ట్రయల్ రన్
- జర్మనీ.. ఫ్రాన్స్.. స్వీడన్.. చైనాలో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో హైడ్రోజన్తో నడిచే రైళ్లు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో.. జర్మనీకి చెందిన TUV-SUD రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది. ఈ రైలు ట్రయల్ రన్ డిసెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా ఈ జాబితాలో చేరనుంది.
హైడ్రోజన్ రైలు ఒక్క యూనిట్ ఖరీదు రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రైల్వే మొదట 35 రైళ్లను నడపనుంది. ఒక్కో రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుంది. దీని గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సిద్ధం చేయడానికి రూ.70 కోట్లు వెచ్చించనున్నారు. సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ బ్యాటరీ, రెండు ఇంధన యూనిట్లను విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలును మొదట జింద్-సోనిపట్ సెక్షన్లో నడపనున్నట్లు సమాచారం. హర్యానాలోని రైళ్లకు హైడ్రోజన్ జింద్లో ఉన్న 1 MW పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెమ్బ్రేన్ ఎలక్ట్రోలైజర్ నుండి అందించబడుతుంది. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 430 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కూడా ఉంటుంది.
Also Read
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
Read Also: Boat Capsizes: పడవ బోల్తా.. 78 మంది మృతి!
ప్రత్యేకత ఏమిటి
హైడ్రోజన్ రైలు హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుంది. ఇందులో ఇంజన్ స్థానంలో హైడ్రోజన్ ఇంధన కణాలు అమర్చబడి ఉంటాయి. ఈ రైళ్లు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ లేదా పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలను విడుదల చేయవు. దీని వల్ల కాలుష్యం ఉండదు. హైడ్రోజన్ ఇంధన కణాల సహాయంతో, హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. ఈ రైలును హైడ్రైల్ అని కూడా అంటారు. ఈ రైలులో నాలుగు కోచ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. నీలగిరి మౌంటైన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై మరియు మార్వార్ దేవ్గర్ మదారియా మార్గాల్లో ఈ రైలును నడపడానికి ప్రణాళిక ఉంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలు కారుపాతల, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతోంది.
డీజిల్ రైలుతో పోలిస్తే ఈ రైలు నడపడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే.. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. గ్రీన్ హైడ్రోజన్ కిలోకు దాదాపు రూ.492 ఉంటుంది. ఈ రైలు నిర్వహణ డీజిల్ రైలు కంటే 27 శాతం ఖర్చుతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెంచి కంపెనీ తొలిసారిగా హైడ్రోజన్ రైలును సిద్ధం చేసింది. 2018 నుంచి అక్కడ హైడ్రోజన్ రైలు నడుస్తోంది.
తాజావార్తలు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!