Greater Noida: అమ్మా అని పిలుస్తూ .. అనంత లోకాలకు.. 18వ అంతస్తు నుంచి పడి బాలుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Greater Noida: అమ్మా అని పిలుస్తూ 12 ఏళ్ల బాలుడు అనంత లోకాలకు వెళ్లాడు. 18వ అంతస్తులో ఉన్న బాలుడు బాల్కనీలో నిలబడి కింద ఉన్న తన తల్లిని పిలుస్తున్నాడు.. ఇంతలో తను బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. 18వ అంతస్తు నుంచి కిందకు పడిపోవడంతో బాలుడు మృతి చెందాడు. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరిగిన అత్యంత విషాదకర ఘటన ఇది. 18 వ అంతస్తులో ఉన్న బాలుడు గ్రౌండ్ ఏరియాలో ఉన్న తన తల్లిని పిలిచాడు. అదే అతనికి అంతిమ ఘడియగా మారింది. ఈ దర్ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో నోయిడా ఎక్స్టెన్షన్ లోని గ్రేటర్ నోయిడా వెస్ట్లో ఈ ఉదంతం జరిగింది. బిస్రఖ్ ప్రాంతానికి చెందిన డివైన్ సొసైటీలో రాత్రి 8 గంటల సమయంలో 18వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి పడిపోయిన 7వ తరగతి చదివే అబ్బాయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ 12 ఏళ్ల బాలుడు అదే బిల్డింగ్లోని గ్రౌండ్ ఏరియాలో ఉన్న తన తల్లిని పిలిచేందుకు 18 వ ఫ్లోరు బాల్కనీలో నుంచి తొంగిచూస్తూ కిందపడిపోయాడు.
Read also: Samirpet Incident: శామీర్పేట్ కాల్పుల ఘటనలో ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
“గురువారం సాయంత్రం చిన్నారిని తల్లిదండ్రులు తీసుకెళ్లిన సంఘటన గురించి ప్రైవేట్ ఆసుపత్రి నుండి మాకు సమాచారం అందింది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్కు చెందిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయపరమైన చర్యలు చేపట్టింది. విచారణలో, పిల్లవాడు తన కుటుంబంతో నివసిస్తున్నాడని మరియు ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడని తేలింది” అని బిస్రఖ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనిల్ కుమార్ తెలిపారు. “గిరి కిందకి చూస్తూ సొసైటీ కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్న తన తల్లిని పిలుస్తున్నప్పుడు అతను బ్యాలెన్స్ తప్పి బాల్కనీ రెయిలింగ్ మీద పడిపోయాడు. గిరి తండ్రి పనిలో ఉన్నాడు. కొడుకు పడిపోవడం చూసి గిరి తల్లి టవర్ వైపు పరుగెత్తింది. అతడిని వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు’ అని అధికారి తెలిపారు. తండ్రి మధ్యప్రదేశ్కు చెందినవాడు మరియు నోయిడాలోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు, ఈ విషయంలో కుటుంబం నుండి ఇంకా ఎటువంటి ఫిర్యాదు రాలేదని కుమార్ తెలిపారు. గత నెలలోనూ పార్క్ సొసైటీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నోయిడాలోని బహుళ అంతస్తుల భవనాల నుంచి జారిపడి మృతిచెందిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..