Manipur: మణిపూర్ లో 50 ఏళ్ల మహిళను కాల్చి చంపిన దుండగులు.. రాష్ట్రంలో ఆగని హింస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్ లో గత రెండున్నర నెలలుగా హింస కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటికే హింస ఆగడం లేదు. తాజాగా మణిపూర్లో ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు 50 ఏళ్ల మహిళను దారుణంగా కాల్చి చంపారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్లోని ఈస్ట్ జిల్లా సావోంబంగ్ ప్రాంతంలో 50 ఏళ్ల వయసున్న మహిళ ముఖంపై దుండుగులు కాల్పులు జరిపారు. ఆమె ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమె ముఖాన్ని వికృతంగా మార్చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మణిపూర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సమీప ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన మహిళ కొంత మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని.. ఆ మహిళ మారింగ్ నాగా కమ్యూనిటీకి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆ మహిళ ఎవరనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రజల వాంగ్మూలాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Governor Tamilisai: బోనాల కోసం నాకు ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ రాలేదు..
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
- Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
మరో ఘటనలో పార్క్ చేసిన ట్రక్కులను కూడా దుండగులు తగులబెట్టారు. ఇంఫాల్ (డబ్ల్యూ) నుంచి నేషనల్ హైవే -2 మీదుగా వెళ్తున్న సిలిండర్లను తీసుకెళ్లడానికి ఉపయోగించే ట్రక్కులను బహిరంగ ప్రదేశంలో నిలిపి ఉంచారు. ఈ సమయంలో వాటికి నిప్పంటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదని, ట్రక్కులకు ఎందుకు నిప్పుపెట్టారో స్పష్టంగా తెలియదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మణిపూర్ లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చినవి మినహా అన్ని ప్లాట్ ఫామ్ లు, అన్ని సర్వీస్ ప్రొవైడర్లలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. అధికారులు ఆమోదించిన కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఇంటర్నెట్ లీజ్ లైన్ (ఐఎల్ఎల్) వినియోగదారులను కూడా నిషేధం నుండి మినహాయించారు.
Read also: Anganwadi Jobs : అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు.. పది పాసైన వాళ్ళు అర్హులు..
మే 3న మీటీలను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్ యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో హింస చెలరేగింది. మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు – నాగాలు, కుకిలు – జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు. వారు కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు. ఈ రెండు జాతుల మధ్య వైరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!