Delhi: ఆన్లైన్ లోన్ యాప్లపై కేంద్రం కొరడా.. 87 యాప్లు బ్లాక్
- ఆన్లైన్ లోన్ యాప్లపై కేంద్రం కొరడా
- 87 యాప్లు బ్లాక్ చేసిన కేంద్రం
- పార్లమెంట్లో వెల్లడించిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మనిషికి ఏదొక సమయంలో డబ్బు అవసరం ఉంటుంది. సమయానికి తెలిసిన వారు సాయం చేయకపోయినా.. బ్యాంక్లు రుణాలు ఇవ్వకపోయినా వెంటనే ఆన్లైన్ లోన్ యాప్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని యాప్లు చట్టానికి లోబడి పని చేస్తుంటే.. మరికొన్ని యాప్లు అక్రమాలకు పాల్పడుతున్నాయి. మనుషుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏది నిజమో.. కాదో తెలియక ప్రజలు మోసపోతున్నారు. కొన్ని ఆన్లైన్ యాప్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ యాప్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది.
ఇది కూడా చదవండి: Shah Rukh Khan: షారూఖ్ఖాన్ మార్కుల షీట్ వైరల్.. మ్యాథ్స్లో ఎన్ని మార్కులొచ్చాయంటే..!
Also Read
- Telegram Ban in India: భారత్లో టెలిగ్రామ్పై నిషేధం ఎందుకు..? వివాదానికి కారణమైన 5 కీలక ఫీచర్లు ఇవే
- Annamalai: తమిళనాడు పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
- Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
దేశ వ్యాప్తంగా 87 అక్రమ రుణ యాప్లను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. ఆన్లైన్ రుణ కార్యకలాపాల్లో పాల్గొన్న కంపెనీలపై 2013 కంపెనీల చట్టం ప్రకారం విచారణలు, ఖాతాల తనిఖీలు, దర్యాప్తులతో సహా నియంత్రణ చర్యలు కాలానుగుణంగా నిర్వహించబడుతున్నాయని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: నేడు సిద్ధరామయ్యతో కేసీ.వేణుగోపాల్ కీలక భేటీ! పంచాయితీ తెగేనా?
డిసెంబర్ 1న లోక్సభలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రి దృష్టికి వచ్చిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2013 ప్రకారం ప్రభుత్వం ‘షెల్ కంపెనీలను’ నిర్వచించాలని యోచిస్తుందా? పనిచేయని సంస్థల పర్యవేక్షణను మెరుగుపరచడానికి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నలో అడిగారు. దీనికి పైవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది.
ఉల్లంఘనలు జరిగినప్పుడల్లా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తనిఖీలు, సమ్మతి తనిఖీలు కొనసాగుతున్నాయని.. క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతున్నాయని సమాధానంలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KTR : ఒక్క ఓటు కూడా పోవద్దు.!
-
Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం.. సిరీస్ కైవసం..
-
Peddi : థియేటర్లలో ‘పెద్ది’ సరికొత్త రచ్చ.. రేపటి నుంచి 6 నిమిషాల కొత్త సీన్స్ లోడింగ్,
-
US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!