Odisha: గూడ్స్ ట్రైన్ కింద తలదాచుకుందామని వెళ్తే.. చక్రాల కిందపడి ఆరుగురు మృతి
Odisha: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన మరవకముందే వరసగా ఒడిశాలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం గూడ్స్ ట్రైన్ చక్రాల కింద పడి ఆరుగురు కూలీలు మరణించారు. ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం నుంచి తప్పించుకునేందుకు ఆరుగురు కూలీలు గూడ్స్ ట్రైన్ కిందకు చేరారు. అయితే ఆ గూడ్స్ ట్రైన్ కు ఇంజిన్ లేదు. ఈ క్రమంలో ఈదురు గాలులు ఎక్కువ కావడంతో, గాలుల ధాటికి గూడ్స్ వ్యాగన్లు కదిలాయి. దీంతో బోగీల కింద ఉన్న ఆరుగురు గూడ్స్ చక్రాల కింద పడి మరణించారు. ఒడిశాలోని ఝాజ్పూర్ రైల్వే స్టేషన్ లో ఈ విషాదకర సంఘటన బుధవారం జరిగింది.
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
బుధవారం రైల్వేకు మతమ్మతులు చేయడానికి కార్మికులు రాగా.. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈక్రమంలో కూలీలు గూడ్స్ బోగీల కింద తలదాచుకున్నారు. ఈ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఆరుగురు కూలీలు మరణించగా, మరికొందరు గాయాలపాలయ్యారు. వీరిని కటక్ లోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇంజిన్ లేకపోవడంతో గాలుల తీవ్రత కారణంగా గూడ్స్ వ్యాగన్లు కదిలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మరణించాగా..మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు.
ఇటీవల ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అదే సమయంలో యశ్వంత్ పూర్ ట్రైన్ వేరే ట్రాక్ పై రావడం, ఆ సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు అదే ట్రాక్ పై పడి ఉండటంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 280కి పైగా ప్రయాణికులు మరణిచంగా.. 1200 మంది కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడ్డారు. మూడు దశాబ్ధాల రైల్వే ప్రమాదాల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం.
తాజావార్తలు
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!