Uttarpradesh: రోడ్డు పక్కన కూర్చున్న వారిపై నుంచి దూసుకెళ్లిన వాహనం.. 6గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడ్తో వెళ్తున్న పికప్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే కూర్చున్న ఎనిమిది మంది వ్యక్తులపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలోని భరత్కప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌలి కళ్యాణ్పూర్ గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది.
మృతుల కుటుంబాలకు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబసభ్యులకు, రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read
IMD: ఈ రోజు అత్యంత భారీ వర్షాలు.. వాతావరణ శాఖ తాజా వార్నింగ్
రౌలి కళ్యాణ్పూర్ గ్రామంలోని ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని చిత్రకూట్ జిల్లా మేజిస్ట్రేట్ సంభ్రాంత్ శుక్లా తెలిపారు.పికప్ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన కూర్చున్న వ్యక్తులను తొక్కివేయడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారని, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని శుక్లా వెల్లడించారు.
తాజావార్తలు
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!