Heat Waves: తీవ్రమైన వేడిగాలులు.. ఇప్పటి వరకూ 54 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీతో సహా పలు చోట్ల మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో.. 54 మంది మృతి చెందారు. మే 31 నుంచి జూన్ 1 వరకు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. మే 31 నుంచి జూన్ 2 మధ్య వాయువ్య భారతదేశంలోని మైదానాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన అతి తక్కువ/తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. గురువారం.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది.
తీవ్రమైన వడగాలుల కారణంగా బీహార్లో 32 మంది వడదెబ్బతో మరణించారు. అందులో ఔరంగాబాద్కు చెందిన 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ఒక్కరు, రోహతాస్లో ముగ్గురు, బక్సర్లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మృతిచెందారు. అటు.. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్లోని పాలము, రాజస్థాన్లలో ఐదుగురు మరణించగా, ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో ఒకరు మరణించారు. గురువారం.. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ మరియు విదర్భలోని అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్లో నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
Read Also: Hyderabad: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అఖిల కేసులో ప్రియుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
పశ్చిమ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, యానాం, గుజరాత్, తెలంగాణ, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవి వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మధ్య మరియు తూర్పు భారతదేశంలోని ఏకాంత ప్రాంతాలలో సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. IMD ప్రకారం.. మే 31, జూన్ 1 తేదీలలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు ఒడిశాలోని ఏకాంత ప్రదేశాలలో వడగాలులు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మే 31, జూన్ 1 న పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్ మరియు ఒడిశా, ఉత్తరప్రదేశ్లో రాత్రులు వేడిగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్, కేరళలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, అస్సాం మరియు మేఘాలయలోని మిగిలిన ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు రావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలిపింది. మే 31 నుండి జమ్మూ-కశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం.. నైరుతి రుతుపవనాలు దాని షెడ్యూల్ ప్రారంభానికి ఒక రోజు ముందు కేరళలో ప్రారంభమయ్యాయి. ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని గతంలో మే 15న వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!