Jammu Kashmir: కుప్వారాలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు లష్కరే ఉగ్రవాదుల హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గురువారం రోజున ఉగ్రవాదులు కుప్వారా సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. హతమైన ఐదుగురు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని కాశ్మీర్ జోన్ పోలీస్ ఏడీజీపి విజయ్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 26న ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.
Also Read
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
Read Also: Delhi High Court: నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది.. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరు..
అంతకుముందు బుధవారం శ్రీనగర్ లోని 15 కార్ఫ్స్ కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. కాశ్మీర్ లో విదేశీ ఉగ్రవాదుల పాత్ర గురించి చర్చించారు. స్థానిక రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోవడంతో విదేశీ ఉగ్రవాదుల సంఖ్య పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 46 మంది ఉగ్రవాదులను మట్టుబెడితే.. ఇందులో 37 మంది పాకిస్తానీయులు కాగా.. 9 మంది స్థానికులు ఉన్నారు. 33 ఏళ్ల జమ్మూ కాశ్మీర్ తీవ్రవాద చరిత్రలో ఒక ఏడాదిలో స్థానిక ఉగ్రవాదుల కన్నా విదేశీ ఉగ్రవాదులు నాలుగు రెట్లు చనిపోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో 130 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నారనరి, వీరిలో సగం మంది పాకిస్తాన్ కి చెందిన వారే అని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!