Jammu Kashmir: కుప్వారాలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు లష్కరే ఉగ్రవాదుల హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గురువారం రోజున ఉగ్రవాదులు కుప్వారా సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. హతమైన ఐదుగురు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని కాశ్మీర్ జోన్ పోలీస్ ఏడీజీపి విజయ్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 26న ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: Delhi High Court: నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది.. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరు..
అంతకుముందు బుధవారం శ్రీనగర్ లోని 15 కార్ఫ్స్ కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. కాశ్మీర్ లో విదేశీ ఉగ్రవాదుల పాత్ర గురించి చర్చించారు. స్థానిక రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోవడంతో విదేశీ ఉగ్రవాదుల సంఖ్య పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 46 మంది ఉగ్రవాదులను మట్టుబెడితే.. ఇందులో 37 మంది పాకిస్తానీయులు కాగా.. 9 మంది స్థానికులు ఉన్నారు. 33 ఏళ్ల జమ్మూ కాశ్మీర్ తీవ్రవాద చరిత్రలో ఒక ఏడాదిలో స్థానిక ఉగ్రవాదుల కన్నా విదేశీ ఉగ్రవాదులు నాలుగు రెట్లు చనిపోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో 130 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నారనరి, వీరిలో సగం మంది పాకిస్తాన్ కి చెందిన వారే అని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!