5 drunk men pour hot oil on hotel owner: చెన్నై సమీపంలో ఓ హోటల్ యజమాని, అతని కొడుకు, సిబ్బందిపై ఐదుగురు తాగుబోతులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా వేడి నూనెను వారిపై పోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై శివారులోని సెలైయూర్ సమీపంలోని మాడంబాక్కంలో జరిగింది.