Panipuri: ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు చిరుతిళ్లకు అలవాటుపడి అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిసార్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో చికెన్ షవార్మా లాంటి పదార్థాలు తిని ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయినవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో పానీపూరి తిని ఏకంగా 40 మంది చిన్నారులు, 10 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.