26/11 Mumbai Terror Attacks: నా భార్య, ఇద్దరు పిల్లల్ని కోల్పోయా.. యూఎన్లో 26/11 బాధితుడు
26/11 Mumbai Terror Attacks – UN Global Congress of Victims of Terrorism: ముంబై 26/11 ఉగ్రదాడుల బాధితులు యూఎన్ మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆవేదనను యూఎన్ లో వినిపించారు. తమకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇచ్చారు. ఈ దారుణ ఘటనలో నేను సర్వస్వం కోల్పోయానని అప్పటి తాజ్ హోటల్ మేనేజర్ గా పనిచేసిన కరంబీర్ కాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధాకరమైన ఆ నాటి చేదు ఘటన జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఈ దాడుల్లో భార్య, ఇద్దరు పిల్లల్ని కోల్పోయాడు కరంబీర్.
నా దేశం, నా నగరం, నా హోటల్ పై ఉగ్రవాదాలు 10 మంది దాడి చేశారని.. మూడు రోజుల పాటు జరిగిన ఈ విషాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. దాడి సమయంలో నా భార్య, ఇద్దరు పిల్లలు తప్పించుకోలేకపోయారని.. నేను సర్వస్వ కోల్పోయానని అన్నారు. నేను చాలా మంది సహచరులను కోల్పోయానని వెల్లడించారు. న్యాయం కోసం మేము 14 ఏళ్ల సుదీర్ఘ బాధాకరమైన ఏళ్లు గడిపామని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
Read Also: TRS in Chennuru Constituency: గులాబీదళంలో విభేదాలు.. మరో కీలక నేత గుడ్ బై..
ముంబై ఎటాక్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉగ్రదాడుల్లో బాధితులుగా ఉన్న వారికి నివాళులు అర్పించేందుకు ఐక్యరాజ్యసమితి మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆప్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సమావేశాలను సెప్టెంబర్ 8-9 తేదీల్లో నిర్వహిస్తోంది. ఉగ్రదాడుల్లో బాధితులుగా ఉన్నవారి ప్రత్యక్ష అనుభవాలు, సవాళ్లను పంచుకునేందుకు ఒక వేదికను యూఎన్ అందిస్తోంది.
2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం గుండా వచ్చిన ఉగ్రవాదులు ముంబైతో మారణ హోమాన్ని సృష్టించారు. ముంబైలో పలు చోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌజ్, ఛత్రపతి శివాజీ టెర్మినల్, కామా ఆస్పత్రి ఇలా పలుచోట్ల కాల్పలు, బాంబు దాడులకు పాల్పడ్డారు. మొత్తం మూడు రోజుల పాటు యావత్ దేశం భయాందోళనలకు లోనైంది. ఈ దాడుల్లో మొత్తం 166 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
ట్రెండింగ్
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!