26/11 Mumbai Terror Attacks: నా భార్య, ఇద్దరు పిల్లల్ని కోల్పోయా.. యూఎన్లో 26/11 బాధితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Mumbai Terror Attacks – UN Global Congress of Victims of Terrorism: ముంబై 26/11 ఉగ్రదాడుల బాధితులు యూఎన్ మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆవేదనను యూఎన్ లో వినిపించారు. తమకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇచ్చారు. ఈ దారుణ ఘటనలో నేను సర్వస్వం కోల్పోయానని అప్పటి తాజ్ హోటల్ మేనేజర్ గా పనిచేసిన కరంబీర్ కాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధాకరమైన ఆ నాటి చేదు ఘటన జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఈ దాడుల్లో భార్య, ఇద్దరు పిల్లల్ని కోల్పోయాడు కరంబీర్.
నా దేశం, నా నగరం, నా హోటల్ పై ఉగ్రవాదాలు 10 మంది దాడి చేశారని.. మూడు రోజుల పాటు జరిగిన ఈ విషాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. దాడి సమయంలో నా భార్య, ఇద్దరు పిల్లలు తప్పించుకోలేకపోయారని.. నేను సర్వస్వ కోల్పోయానని అన్నారు. నేను చాలా మంది సహచరులను కోల్పోయానని వెల్లడించారు. న్యాయం కోసం మేము 14 ఏళ్ల సుదీర్ఘ బాధాకరమైన ఏళ్లు గడిపామని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
Read Also: TRS in Chennuru Constituency: గులాబీదళంలో విభేదాలు.. మరో కీలక నేత గుడ్ బై..
ముంబై ఎటాక్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉగ్రదాడుల్లో బాధితులుగా ఉన్న వారికి నివాళులు అర్పించేందుకు ఐక్యరాజ్యసమితి మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆప్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సమావేశాలను సెప్టెంబర్ 8-9 తేదీల్లో నిర్వహిస్తోంది. ఉగ్రదాడుల్లో బాధితులుగా ఉన్నవారి ప్రత్యక్ష అనుభవాలు, సవాళ్లను పంచుకునేందుకు ఒక వేదికను యూఎన్ అందిస్తోంది.
2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం గుండా వచ్చిన ఉగ్రవాదులు ముంబైతో మారణ హోమాన్ని సృష్టించారు. ముంబైలో పలు చోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌజ్, ఛత్రపతి శివాజీ టెర్మినల్, కామా ఆస్పత్రి ఇలా పలుచోట్ల కాల్పలు, బాంబు దాడులకు పాల్పడ్డారు. మొత్తం మూడు రోజుల పాటు యావత్ దేశం భయాందోళనలకు లోనైంది. ఈ దాడుల్లో మొత్తం 166 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!