Karnataka: పట్టపగలు నడిరోడ్డుపై మహిళా టీచర్ కిడ్నాప్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై 23 ఏళ్ల మహిళా టీచర్ కిడ్నాప్కు గురైంది. గురువారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లికి నిరాకరించిందని ఆమె బంధువే కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా బిట్టగౌడనహళ్లికి చెందిన అర్పిత స్థానిక స్కూల్లో టీచర్గా పని చేస్తోంది.
Also Read: Karnataka: స్థానిక ప్రజలకే కాదు, రోడ్లపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది.. కర్ణాటక హైకోర్టు తీర్పు
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
ఈ క్రమంలో గురువారం యదావిధిగా పాఠశాలకు వెళ్లిన ఆమెను ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. దీని వెనుక వారి బంధువు రాము ఉన్నట్టు బాధితురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా అర్పితకు వారి బంధువుకు కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో ఆమెను ప్రేమించిన అతడు పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పి వారితో పాటు అర్పిత ఇంటికి వెళ్లాడు. బాధితురాలి తల్లిదండ్రులకు అర్పితను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి అర్పితతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా నిరాకరించారు. వారిపై కోపం పెంచుకున్న రాము అర్పితను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు.
Also Read: Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎంత పోలింగ్ అంటే..?
దీంతో పాఠశాల నుంచి బయటకు వస్తున్న ఆమెను ఎస్యూవీ కారులో వచ్చిన అతడి అనుచరులు బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె అరుపులు విన్న స్థానికులు కారును వెంబడించిన ఫలితం లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడినట్టు పోలీసు అధికారి తెలిపారు. అయితే అర్పిత కిడ్నాప్ వెనుక వారి బంధువు రాము ఉన్నట్టుగా బాధితురాలి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారని, ఆ దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!