Karnataka: పట్టపగలు నడిరోడ్డుపై మహిళా టీచర్ కిడ్నాప్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై 23 ఏళ్ల మహిళా టీచర్ కిడ్నాప్కు గురైంది. గురువారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లికి నిరాకరించిందని ఆమె బంధువే కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా బిట్టగౌడనహళ్లికి చెందిన అర్పిత స్థానిక స్కూల్లో టీచర్గా పని చేస్తోంది.
Also Read: Karnataka: స్థానిక ప్రజలకే కాదు, రోడ్లపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది.. కర్ణాటక హైకోర్టు తీర్పు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఈ క్రమంలో గురువారం యదావిధిగా పాఠశాలకు వెళ్లిన ఆమెను ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. దీని వెనుక వారి బంధువు రాము ఉన్నట్టు బాధితురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా అర్పితకు వారి బంధువుకు కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో ఆమెను ప్రేమించిన అతడు పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పి వారితో పాటు అర్పిత ఇంటికి వెళ్లాడు. బాధితురాలి తల్లిదండ్రులకు అర్పితను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి అర్పితతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా నిరాకరించారు. వారిపై కోపం పెంచుకున్న రాము అర్పితను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు.
Also Read: Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎంత పోలింగ్ అంటే..?
దీంతో పాఠశాల నుంచి బయటకు వస్తున్న ఆమెను ఎస్యూవీ కారులో వచ్చిన అతడి అనుచరులు బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె అరుపులు విన్న స్థానికులు కారును వెంబడించిన ఫలితం లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడినట్టు పోలీసు అధికారి తెలిపారు. అయితే అర్పిత కిడ్నాప్ వెనుక వారి బంధువు రాము ఉన్నట్టుగా బాధితురాలి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారని, ఆ దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!