Gujarat: గుజరాత్ ఎమ్మెల్యేల్లో 22 శాతం మంది నేర చరితులే.. 151 మంది కోటీశ్వరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
22 percent of Gujarat MLAs Face Serious Cases: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. వరసగా ఏడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. 182 అసెంబ్లీ స్థానాల్లో 156 స్థానాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే గుజరాత్ ఎమ్మెల్యేల్లో 22 శాతం మంది నేరచరితులే ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం మంది ఎమ్మెల్యేలలో 151 మంది కోటీశ్వరులు ఉన్నారని తెలిపింది. అసెంబ్లీలో 22 శాతం అంటే సుమారుగా 40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. అయితే 2017లో 47 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా.. ఈ సారి తగ్గింది. ఈ 40 మందిలో 29 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాడులు, హత్య, కిడ్నాప్, అత్యాచారం, అవినీతి ఇలా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకరిపై అత్యాచారం కేసు ఉంది.
Read Also: Geminids Meteor: ఆకాశంలో అద్భుతం.. వీక్షించే అవకాశం మిస్కావద్దు
Also Read
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
బీజేపీ నుంచి గెలిచిన 156 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది, కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది ఎమ్మెల్యేల్లో 9 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో బీజేపీ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి నలుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 182 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది కోటీశ్వరులే ఉన్నారు. గతంలో పోలిస్తే ఈ సారి గుజరాత్ అసెంబ్లీలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది.
కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో 80 శాతానికి పైగా ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిస్తే 14 మంది, 156 బీజేపీ ఎమ్మెల్యేల్లో 132 మంది కోటికి పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. బీజేపీకి చెందిన జయంతిభాయ్ పటేల్ రూ. 661 కోట్లకు పైగా ఆస్తులతో అసెంబ్లీలోనే రిచ్చెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీకి చెందిన కోకాని మోహన్ భాయ్ ధేదాభాయ్ రూ.18.56 లక్షల ఆస్తితో అత్యంత పేద ఎమ్యెల్యేగా ఉన్నారు.
తాజావార్తలు
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..