Gujarat: గుజరాత్ ఎమ్మెల్యేల్లో 22 శాతం మంది నేర చరితులే.. 151 మంది కోటీశ్వరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
22 percent of Gujarat MLAs Face Serious Cases: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. వరసగా ఏడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. 182 అసెంబ్లీ స్థానాల్లో 156 స్థానాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే గుజరాత్ ఎమ్మెల్యేల్లో 22 శాతం మంది నేరచరితులే ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన నివేదికలో పేర్కొంది. మొత్తం మంది ఎమ్మెల్యేలలో 151 మంది కోటీశ్వరులు ఉన్నారని తెలిపింది. అసెంబ్లీలో 22 శాతం అంటే సుమారుగా 40 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. అయితే 2017లో 47 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా.. ఈ సారి తగ్గింది. ఈ 40 మందిలో 29 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాడులు, హత్య, కిడ్నాప్, అత్యాచారం, అవినీతి ఇలా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకరిపై అత్యాచారం కేసు ఉంది.
Read Also: Geminids Meteor: ఆకాశంలో అద్భుతం.. వీక్షించే అవకాశం మిస్కావద్దు
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
బీజేపీ నుంచి గెలిచిన 156 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది, కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది ఎమ్మెల్యేల్లో 9 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో బీజేపీ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి నలుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 182 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది కోటీశ్వరులే ఉన్నారు. గతంలో పోలిస్తే ఈ సారి గుజరాత్ అసెంబ్లీలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది.
కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో 80 శాతానికి పైగా ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిస్తే 14 మంది, 156 బీజేపీ ఎమ్మెల్యేల్లో 132 మంది కోటికి పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. బీజేపీకి చెందిన జయంతిభాయ్ పటేల్ రూ. 661 కోట్లకు పైగా ఆస్తులతో అసెంబ్లీలోనే రిచ్చెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీకి చెందిన కోకాని మోహన్ భాయ్ ధేదాభాయ్ రూ.18.56 లక్షల ఆస్తితో అత్యంత పేద ఎమ్యెల్యేగా ఉన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?