Floods And Landslides: భారీ వర్షాలు, వరదలతో 2,038 మంది మృతి… 335 జిల్లాలు ప్రభావితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Floods And Landslides: దేశంలో భారీ వర్షాలు, వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయగా.. ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పర్యాటక ప్రాంతంగా, అందంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ నాశనం అయింది. ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా 2,038 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 335 జిల్లాలు ప్రభావితమయ్యాయి. వర్షాలు, వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటం వల్ల 2,038 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో బీహార్లో అత్యధికంగా 518 మంది మరియు హిమాచల్ ప్రదేశ్ 330 మంది ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన డేటా ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 17 వరకు వర్షాలు మరియు వరదల సమయంలో 101 మంది అదృశ్యం కాగా.. 1,584 మంది గాయపడ్డారు. వర్షాలు, కొండచరియలు మరియు పిడుగుల కారణంగా 335 జిల్లాలు ప్రభావితమయ్యాయి. వాటిలో 40 మంది మధ్యప్రదేశ్, అస్సాంలో 30 మరియు ఉత్తరప్రదేశ్లో 27 జిల్లాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని 12 జిల్లాలు, ఉత్తరాఖండ్లోని 7 జిల్లాల్లో కూడా రుతుపవనాల ప్రభావంతో కురిసిన వర్షాలు, వరదలు మూలంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Read also: NTR: ఎన్టీఆర్ మరి కాసేపట్లో చనిపోతాడనగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా?
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
వరదల కారణంగా 897 మంది మునిగిపోయారు. 506 మంది పిడుగుపాటు కారణంగా మరణించగా.. కొండచరియలు విరిగిపడి 186 మంది ప్రాణాలు కోల్పోయారు.
వర్షాకాలంలో వివిధ కారణాలతో మొత్తం 454 మంది మరణించారు. బీహార్, హిమాచల్ప్రదేశ్లతో పాటు గుజరాత్లో వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 165 మంది, మధ్యప్రదేశ్లో 138 మంది.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు 107 మంది.. ఛత్తీస్గఢ్లో 90 మంది, ఉత్తరాఖండ్లో 75 మంది మరణించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన మొత్తం 160 బృందాలను వివిధ రాష్ట్రాల్లో మోహరించారు. వాటిలో హిమాచల్ ప్రదేశ్లో 17, మహారాష్ట్రలో 14, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కొక్కటి 12, అస్సాం, పశ్చిమ బెంగాల్లో 10, ఉత్తరాఖండ్లో 9 బృందాలను మోహరించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!