2025 Crimes Rewind: గోల్డ్ స్మగ్లింగ్ దగ్గర నుంచి హనీమూన్ మర్డర్ వరకు..! ఈ ఏడాది క్రైమ్ సీన్స్ ఇవే!
- ఇంకొన్ని గంటల్లో ముగియనున్న 2025 సంవత్సరం
- ఈ ఏడాది సంచలనం సృష్టించిన క్రైమ్ కేసుల్లో మహిళలు
ఇంకొన్ని గంటల్లో 2025 సంవత్సరం ముగియనుంది. 2026 సంవత్సరానికి వెల్కమ్ పలకనున్నారు. అయితే ఈ ఏడాది అనేక క్రైమ్ సీన్లలో నారీమణులు ప్రముఖ పాత్ర పోషించారు. అడ్డదారులు తొక్కి కటకటాల పాలయ్యారు. కొందరు మహిళలు చరిత్ర సృష్టిస్తే.. ఇంకొందరు మహిళలు నేరాలకు పాల్పడి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. వారు ఎవరు? ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
రన్యారావు..
రన్యారావు కన్నడ నటి. తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు. మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ దొరికిపోయింది. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వీఐపీ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తప్పించుకుంది. అయితే పాపం పండి దొరికిపోయింది. ప్రస్తుతం జైల్లో మగ్గుతోంది. దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో సోదాలు చేయగా.. కోట్ల విలువైన ఆభరణాలతో పాటు భారీగా నగదు లభ్యమైంది.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!

మీరుట్ హత్య
మీరుట్ హత్య యావత్తు దేశాన్ని కుదిపేసింది. నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలు అత్యంత దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కులుగా చేసి డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డ్రగ్స్ బానిసలుగా మారిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

సోనమ్ రఘువంశీ
సోనమ్ రఘువంశీ(యూపీ).. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని మే 9న వివాహం చేసుకుంది. అనంతరం హనీమూన్ మర్డర్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి కిరాయి హంతకులతో అంతమొందించింది. అనంతరం భర్త మృతదేహాన్ని లోయలో పడేసి ప్రియుడు రాజ్ కుశ్వాహా పారిపోయింది. జూన్లో సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు ఈ ఘటనపై సినిమా కూడా రాబోతుంది.

జ్యోతి మల్హోత్రా
జ్యోతి మల్హోత్రా పేరు పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పేరు మార్మోగింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్ర దాడి జరిగింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారతదేశం పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్కు ఐఎస్ఐ ఏజెంట్గా పని చేసినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ అధికారులతో అంటకాగినట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.

డాక్టర్ షాహీన్ సయీద్
షాహీన్ సయీద్.. దేశ వ్యాప్తంగా భారీ ఉగ్ర దాడులకు ప్లాన్ చేసింది. సహచర డాక్టర్లు ఉమర్, ముజమ్మిల్తో కలిసి బాంబ్ పేలుళ్లకు కుట్ర పన్నింది. డిసెంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్లో డాక్టర్ ఉమర్ హతమయ్యాడు. వీళ్లంతా అల్-ఫలాహ యూనివర్సిటీ వేదికగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు బృందం గుర్తించింది. ప్రస్తుతం నిందితులు జైల్లో ఉన్నారు.

తాజావార్తలు
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!