Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోల హతం
- ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్
- 20 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోతతో పచ్చని అడవి రక్తసిక్తమైంది. శనివారం సుక్మా జిల్లాలోని ఉపంపల్లిలోని గోగుండ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.
శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు 20 మంది మావోలు చనిపోగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సుక్మా చరిత్రలో భద్రతా దళాలకు ఇది భారీ విజయంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా సమాచారం. సీఆర్పీఎఫ్ జవాన్లు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సుక్మా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. భారీగానే మావోలు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
3 నెలల కాలంలో ఇప్పటి వరకు 100 మంది మావోలు చనిపోయారు. బీజాపూర్, సుక్మా జిల్లాలో ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లకు పాల్పడ్డారు.
మావోల దుశ్చర్య
ఇదిలా ఉంటే బీజాపూర్ జిల్లాలో మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉసుపరి గ్రామంలోని నదిలో ఐఈడీ బాంబు పేల్చారు. భద్రతా దళాల లక్ష్యంగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ప్రాథమిక చికిత్స కోసం భైరంగఢ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!