Jammu Kashmir: వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదుల హతం.. కేంద్రం అప్రమత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ వరస ఎన్కౌంటర్లతో అట్టుడుకుతోంది. బుధవారం నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఏదో చోట ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. శనివారం బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభం అయింది. మరోవైపు రాజౌరీలో శుక్రవారం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. రాజౌరీ ఎన్కౌంటర్ ఇప్పటికే 9 పారా కమాండో దళానికి చెందిన నలుగురు జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Read Also: Rajouri terror attack: పీఓకే నుంచి రాజౌరి ఉగ్రదాడి.. లష్కర్ తీవ్రవాది సజ్జిద్ జుట్ హస్తం..
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ఇదిలా ఉంటే ఈ రోజు ఈ రెండు ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతాబలగాలు. రాజౌరీలోని అటవీ ప్రాంతాల్లోని గుహల్లో వేళ్లూనుకున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ‘ఆపరేషన్ త్రినేత్ర’లో భాగంగా భారీ బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. రక్షణ మంత్రి క్షేత్రస్థాయిలో ఆపరేషన్ ను సమీక్షిస్తున్నారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సైన్యానికి చెందిన కమాండర్లు, కీలక అధికారులు శ్రీనగర్ వెళ్తున్నారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జమ్మూ కాశ్మీర్ పోలీసు డిజిపి ఆపరేషన్ని పర్యవేక్షిస్తున్నారు.
బారాముల్లా ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదిని లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చనిపోయిన ఉగ్రవాదిని అబిద్ వనీగా గుర్తించారు. కుల్గామ్ లోని హార్హోల్ బాబాపురాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడి నుంచి ఉగ్రవాద సాహిత్యం, ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు రాజౌరీ ఎన్కౌంటర్ లో కూడా ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. చనిపోయిన ఉగ్రవాది నుంచి ఏకే-56, పిస్టల్స్, మ్యాగజైన్, గ్రెనేడ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!