Shiv Sena: షిండే క్యాంప్తో టచ్లో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆ రాష్ట్రంలో దారుణంగా విఫలమైంది. మొత్తం 48 ఎంపీ సీట్లలో బీజేపీ కూటమి 17 స్థానాలకే పరిమితం కాగా, ఇండియా కూటమి 30 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 13, ఉద్దశ్ శివసేన 09, శరద్ పవార్ ఎన్సీపీ 08 సీట్లను గెలుచుకుంది. అనూహ్యంగా బీజేపీ 09 స్థానాలకు మాత్రమే పరిమితమైంది, షిండే శివసేన 07 స్థానాలను గెలుచుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీ 01 స్థానంలో సరిపెట్టుకుంది.
Read Also: Sheikh Hasina: ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. ఘన స్వాగతం
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో జంపింగ్ పాలిటిక్స్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నునంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో టచ్లో ఉన్నట్లు షిండే వర్గం శనివారం పేర్కొనడం సంచలనంగా మారింది. శివసేన(షిండే) అధికార ప్రతినిధి నరేష్ మాస్కే మాట్లాడుతూ.. ఇద్దరు ఎంపీలతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పారు. అయితే, వారి పేర్లు వెల్లడించలేదు.
ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన కొందరి ఓట్లను ఉద్ధవ్ ఠాక్రే అడగటంపై ఇద్దరు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నరేష్ చెప్పారు. కాబోయే ప్రధాని నరేంద్రమోడీకి ఈ ఇద్దరు మద్దతు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు షిండే వర్గం ఎమ్మెల్యేలు ఠాక్రే వర్గంలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని శివసేన(ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నరేష్ మాస్కే వ్యాఖ్యలు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్కు షాక్.. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!