J-K: చైనా కోసమే కాశ్మీర్లో పాక్ ఉగ్రవాద సంస్థ దాడి!.. 7గురు భారతీయుల మృతి
- కశ్మీర్లో మరోసారి ఉగ్రదాడి
- ఈ ఘటనలో ఏడుగురు మృతి
- దాడికి బాధ్యత వహించిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'
- చైనా ప్రయోజనాల కోసం దాడి చేసినట్లు సమాచారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో సొరంగం నిర్మాణ సంస్థ క్యాంప్సైట్పై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ సొరంగం గగనీర్ను సెంట్రల్ కాశ్మీర్లోని సోనామార్గ్కు కలుపుతుంది. కాగా.. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాలో ఒక భాగం. పాకిస్థాన్కు చెందిన మరో ఉగ్రవాద సంస్థ ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ (పిఎఎఫ్ఎఫ్) టీఆర్ఎఫ్ను ప్రశంసించింది. ఇది వ్యూహాత్మక దాడి అని పేర్కొంది. తూర్పు సరిహద్దు వైపు భారత సైన్యం మోహరింపును అడ్డుకునేందుకే ఈ దాడి జరిగిందని పీఏఎఫ్ఎఫ్ పేర్కొంది. పీఏఎఫ్ఎఫ్ తన ప్రకటనలో “చైనీస్ స్నేహితులు” అని కూడా ప్రస్తావించింది. ఈ దాడిలో చైనా ప్రమేయంపై అనుమానం మొదలైంది. అయితే, పీఏఎఫ్ఎఫ్ ప్రకటనలకు మించి బీజింగ్ ప్రమేయాన్ని సమర్థించే ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.
READ MORE: Anil Ravipudi: దిల్ రాజుపై పంతం నెగ్గించుకున్న అనిల్ రావిపూడి?
Also Read
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
దాడి ఎక్కడ జరిగింది?
శ్రీనగర్-లేహ్ హైవేపై నిర్మిస్తున్న 6.5 కి.మీ పొడవైన జెడ్-టర్న్ టన్నెల్ నిర్మాణ స్థలంలో ఈ దాడి జరిగింది. ఈ సొరంగం కాశ్మీర్- లడఖ్ మధ్య కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. యూపీకి చెందిన ఏపీసీవో ఇన్ఫ్రాటెక్ నిర్మించిన ఈ సొరంగం నవంబర్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ టైమ్లైన్లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు.
READ MORE: SEBI: సెబీ ఛైర్పర్సన్ మాధబికి ఊరట.. ఆరోపణలపై కేంద్రం క్లీన్చిట్!
ఎలా దాడి చేశారు?
2022లో ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించిన టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలతో ఇద్దరు ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు క్యాంప్సైట్లోకి ప్రవేశించి మెస్ ప్రాంతంలో విందు కోసం గుమిగూడిన కార్మికులపై కాల్పులు జరిపారు. బాధితుల్లో బీహార్కు చెందిన ముగ్గురు కార్మికులు – ఫహీమ్ నసీర్, మహ్మద్ హనీఫ్, అబ్దుల్ కలాం – మధ్యప్రదేశ్కు చెందిన అనిల్ శుక్లా, పంజాబ్కు చెందిన గుర్మీత్ సింగ్, జమ్మూకి చెందిన ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ శశి భూషణ్ అబ్రోల్, కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాకు చెందిన డాక్టర్ షానవాజ్ అహ్మద్ దార్ ఉన్నారు. ఈ దాడి ఘటనను కాశ్మీర్ అంతటా విస్తృతంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?