Jammu Kahmir: కేంద్రం కీలక నిర్ణయం.. లోయలో కాశ్మీర్ పండిట్ టీచర్ల బదిలీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాశ్మీర్ లోయలో హిందువులు ముఖ్యంగా హిందూ పండిట్లపై వరసగా టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. పలువురు చనిపోయారు.. దీంతో కాశ్మీర్ లోని హిందువులు భయాందోళనకు గురువుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని గత కొంత కాలంగా కాశ్మీరి హిందువులు నిరసన, ఆందోళను నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వంపై ఒత్తడి పెరిగింది.
తాజాగా జమ్మూకాశ్మీర్ లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 177 మంది కాశ్మీరీర పండిట్ ఉపాధ్యాయులను శ్రీనగర్ నగరానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లు, స్థానికేతరులను టార్గెట్ చేస్తు ఉగ్రవాదులు చంపుతుండటంతోె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కాశ్మీర్ విద్యాశాక 177 మంది కాశ్మీర్ పండిట్ టీచర్ల జాబితాను బహిరంగపరిచింది.దీంట్లో టీచర్ల పేర్లు వారు బదిలీ చేయబడిని పాఠశాల వివరాలు కూడా ఉండటంతో మరోసారి వీరి భద్రతకు భగం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
శుక్రవారం అమిత్ షాతో హైలెవల్ మీటింగ్ జరిగిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో వరసగా టార్గెటెడ్ కిల్లింగ్ జరగడంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు.
మే 12న బుద్గామ్ లో చదూరా తాహసీల్ ఆఫీస్ లో పని చేస్తున్న రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. ఆ తర్వాత నుంచి వరసగా లక్ష్యిత దాడులు జరగుతున్నాయి. ఇటీవల కాశ్మీరీ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను కూడా ఇలాగే కాల్చి చంపారు. ఇటీవల రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్, హిందూ ఉపాధ్యాయురాలు, ఇద్దరు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!