Manipur: స్టడీ టూర్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 15 మంది విద్యార్థుల దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 students feared dead in road accident in Manipur: మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కు వెళ్లిన విద్యార్థులు రోడ్డు ప్రమాదం బారిన పడి మరణించారు. ఈ ఘటన బుధవారం నోనీ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఖౌపుమ్ ప్రాంతంలో హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది విద్యార్థులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Rajagopal Reddy: కవితకు రాజగోపాల్ కౌంటర్.. నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యైరిపోక్ లోని తంబల్ను హయ్యర్ సెకండరీ స్కూల్ కు చెందిన 36 మంది విద్యార్థులు, సిబ్బందితో కలిసి ప్రయాణిస్తున్న బస్సు బుధవారం ఉదయం 11 గంటకు రాజధాని ఇంఫాల్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంగ్ సాయి గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. స్టడీ టూర్ లో భాగంగా విద్యార్థులు ఖౌపుమ్ వైపు వెళ్తున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఇంఫాల్ లోని ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుం సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సమప్ రంజన్ సింగ్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అమ్మాయిలు ప్రమాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఘటనపై మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి..ఘటన స్థలంలో సహాయకచర్యలు జరుగుతున్నట్లు.. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు.
Deeply saddened to hear about the accident of a bus carrying school children at the Old Cachar Road today. SDRF, Medical team and MLAs have rushed to the site to coordinate the rescue operation.
Praying for the safety of everyone in the bus.@PMOIndia pic.twitter.com/whbIsNCSxO
— N. Biren Singh (@NBirenSingh) December 21, 2022
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!