Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం.. 13 మంది మావోలు లొంగుబాటు
- ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం
- 13 మంది మావోలు లొంగుబాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు తీవ్ర ప్రతి ఘటనలు ఎదురవుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్లో మావోయిస్ట్ కీలక నేతలతో సహా పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక అభయారణ్యంలో మావోల మనుగడ కష్టంగా మారింది. ఇప్పటికే తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ పిలుపు సత్ ఫలితాన్ని ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 8 మంది మహిళలు సహా 13 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. కేంద్రం కల్పించిన నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోలకు పునరావాసం కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. 90 వేలకు దిగొచ్చిన బంగారం!
ఇక లొంగిపోయిన మహిళల్లో ఒకరైన దేవ్ ముచాకి అలియాస్ ప్రమీల (21)పై రూ.8లక్షల రివార్డు ఉంది. ఇక ధమ్తారి-గరియాబంద్-నువాపాడ డివిజన్ పరిధిలోని ఏరియా కమిటీ సభ్యుడైన కోసా ఓయం అలియాస్ రాజేంద్ర అలియాస్ మహేష్ అలియాస్ మహేష్ సాగర్ అలియాస్ రమేష్ (29) పై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో మావోయిస్టు కోసి పోడియం (27) తలపై రూ.2 లక్షల రివార్డు ఉంది. సమ్మి సెమ్లా (23), ఛోటూ పార్సిక్ అలియాస్ దీపక్ (25), మోతీ తాటి (24), సునీత హేమ్లా (24), మంజుల కుంజమ్ (27), సైబో పొడియం (18), హంగీ ఉండుమ్ అలియాస్ రాధ (21) తలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని.. మిగతా ముగ్గురికి ఎలాంటి పారితోషికం లేదని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందించామని, ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారి తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో ఇప్పటివరకు 241 మంది నక్సలైట్లు హింసను విరమించుకున్నారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!