Himachal Pradesh: శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం.. కారు వాగులో కొట్టుకుపోయి 11 మంది మృతి
- హిమాచల్ ప్రదేశ్ లో విషాదం
- వాగులో గల్లంతై ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి
- వివాహ శుభకార్యానికి అని బయల్దేరిన 12 మంది కుటుంబ సభ్యులు.
చావు ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు.. ఓ వివాహ వేడుకకు అని బయల్దేరిన ఒకే కుటుంబానికి చెందిన 12 మంది సభ్యుల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భటోలి గ్రామానికి చెందిన వీరంతా ఓ వివాహ శుభకార్యానికి అని బయల్దేరారు. అయితే.. మార్గమధ్యలో జెజో ప్రాంతంలో వాగులో పడి ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 11 మంది చనిపోగా.. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Also: Trai New Rule: ఇకపై అలాచేస్తే మీ సిమ్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్లో..
Also Read
మృతులు సుర్జీత్ సింగ్ (55), పరమజీత్ కౌర్ (50), గగన్దీప్ (19), దీపక్ (22), రామ్ స్వరూప్, పల్వీందర్ కౌర్, నితిన్, శీను దేవి, అమ్రిక్ సింగ్, హర్షిత్, భావన, మన్నత్ గా గుర్తించారు. వీరంతా ఓ కారును బుక్ చేసుకుని మెహ్రోవాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. జైజోన్ అనే ప్రాంతంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. వాగు ఉధృతిని చూసిన డ్రైవర్.. కాసేపు ఆగి వెళ్దామనుకున్నాడు. అయితే కొన్ని వాహనాలు ఆ వరద నీటిని దాటి వెళ్తుండటంతో వారు కూడా వెళ్లాలని భావించారు.
Read Also: Medchal: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి..
కానీ వాగు ఉధృతి అధిక వేగంతో ప్రవహిస్తుండటంతో కారు నీటిలో కొట్టుకుపొయింది. అది చూసిన స్థానికులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆ కారులో ప్రయాణిస్తున్న దీపక్ను మాత్రే బయటకు తీయగలిగారు. మిగతా వాళ్లను రక్షించలేకపోయారు. అయితే.. కారులో కొట్టుకుపోయిన వారిలో తొమ్మిది మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇంకా ఇద్దరి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. సీఎం సుఖు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. “జెజో (హిమాచల్-పంజాబ్ సరిహద్దు) సమీపంలో వరద ప్రవాహం కారణంగా ఉనా జిల్లాలోని డెహ్లాన్ గ్రామానికి చెందిన సుమారు 11 మంది ప్రమాదానికి గురయ్యారు. నేను స్థానిక పరిపాలనతో సంప్రదింపులు జరుపుతున్నాను. సహాయ మరియు సహాయక చర్యలు బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించాలని, ఈ కష్టకాలంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి” అని తెలిపారు.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!