Errabelli Dayakar Rao: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao criticizes Chandrababu Naidu: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రాలో, తెలంగాణలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదని అన్నారు. టీడీపీ ఎన్టీరామారావు పార్టీ అని అన్నారు. మధ్యలో వచ్చినవాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఎన్టీఆర్ని చంద్రబాబు మోసం చేశాడని.. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆయన కుటుంబానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగా తన కొడుకును లోకేష్ ను ఫోకస్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. లోకేష్ ను ఎవ్వరూ కోరుకోవడం లేదని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ని ప్రజలు కోరుకుంటున్నారని.. పార్టీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటేనే బాగుంటుందని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి అన్నారు. ఆంధ్రలో ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ ఉండాలని కోరుకుంటున్నారు. తెలుగు దేశం, ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ని సీఎం చేయాలని.. ఇలా చేస్తే నీకు ఎన్టీఆర్ కుటుంబం ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందో అని అన్నారు. లోకేష్ ను ఎక్స్పోజ్ చేస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
Read Also: Charles Sobhraj: ఆయనకు 64, ఆమెకు 21.. సీరియల్ కిల్లర్తో మూడుముళ్ళు..
హరికృష్ణ బిడ్డను తెలంగాణలో ఎన్నికల్లో పెట్టి ఓడించారని మండిపడ్డారు. ఎక్కడా పొద్దుపోక తెలంగాణకు వస్తుండని విమర్శించారు. ఇక్కడ చిచ్చపెట్టేందుకు గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేశాడని దుయ్యబట్టారు. ఇప్పుడు బీజేపీతో ములాఖత్ అయి చిచ్చుపెట్టాలని చూస్తుండు అని అన్నారు. తెలంగాణలో కేఏపాల్, షర్మిల మాదిరిగా చిచ్చుపెట్టాలని చూస్తుండని ఎర్రబెల్లి విమర్శించారు.
ఉపాధి హామీని తెలంగాణలో రద్దు చేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 25 వేల కోట్లు ఉపాధి హామి నిధులు నిలిపివేసింది. సముద్రం ఒడ్డున చేపలు ఎండబెట్టడానికి కల్లాలకు నిధులు ఇస్తోంది కానీ తెలంగాణలో రైతుల కల్లాలకు డబ్బులు ఇవ్వడం లేదన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు జిల్లా కేంద్రంలో ధర్నాలు చేస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు పతమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!