UtterPradesh: పది రూపాయల గొడవ .. దుకాణదారుడిపై దుండగుల కాల్పులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UtterPradesh: షాపుల దగ్గర, హోటల్స్ దగ్గర చిన్న విషయాలు ఒక్కోసారి చాలా సీరియస్గా మారుతాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఘటనలు జరిగడానికి దారితీస్తాయి. కొద్ది రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో టోల్గేట్ సిబ్బందిలో ఒకరు రూ. 100 ఇతరులకు తెలియకుండా తీశారని.. ఆ తరువాత సీసీటీవీ ఫుటేజ్ లో చూసి అతనిపై దాడి చేసి చనిపోయేలా కొట్టారు. ఇది కేవలం రూ. 10 కోసం జరిగిన గొడవ.. అదికాస్త ముదిరి పాకానపడి.. ఏకంగా దుకాణదారున్ని నిందితులు కాల్పులు జరిపి చంపే వరకు వెళ్లింది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.
Read also: Pawan Kalyan: ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరకూడదంతే..!
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్పురిలో ఈ ఘటన వెలుగు చూసింది. కేవలం రూ.10 కోసం చెలరేగిన వివాదం ఓ దుకాణదారుని ప్రాణాలు తీసింది. అతడిని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
జూన్ 12న ఈ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత మంగళవారం జూన్ 27,గుల్ఫామ్ను పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ తెలిపారు. జాతవ్ తన దుకాణంలో పెట్రోల్తో పాటు ఇతర వస్తువులను విక్రయించేవాడని గుల్ఫామ్ వెల్లడించాడు. ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు గుల్ఫామ్ జాతవ్ దగ్గర పెట్రోల్ కొనుగోలు చేశాడు. డబ్బులు ఇచ్చాడు.. అయితే గుల్ఫామ్ ఇచ్చిన డబ్బుల్లో పది రూపాయలు తక్కువయ్యాయి. ఈ విషయంపై జాతవ్.. గుల్ఫామ్ ను నిలదీశాడు.
బ్యాలెన్స్ మొత్తం ఇవ్వాలంటూ గుల్ఫామ్ ను జాతవ్ అడిగాడు. అందుకు అతను నిరాకరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదానికి దారితీసింది. మహేశ్చంద్ జాతవ్.. గుల్ఫామ్ను డబ్బులు మొత్తం ఇవ్వకపోతే అంతుచూస్తా అని బెదిరించాడని నిందితులను విచారించిన తర్వాత పోలీసులు తెలిపారు. జాతవ్ బెదిరించడంతో, గుల్ఫామ్ తీవ్ర కోపానికి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 12 రాత్రి జాతవ్ను కాల్చి చంపాడు. 12న కాల్చి చంపిన ఘటనలో నిందితులను ఈ నెల 27న పోలీసులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!