నర్తనం… అభినయం… వైజయంతీమాల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరిని చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతటి అందం సొంతం చేసుకున్నవారిలో కళలు నెలకొని ఉంటే మరింతగా చూసి మురిసిపోతాము. ఆ కళల్లోనూ కరగని వైభవం ఉందంటే, అభిమానంతో కరిగిపోతూ, ఆ కళల నిలయాన్ని ఆరాధిస్తూ ఉంటాము. రాతి గుండెల్లో సైతం కళాభిరుచి కలిగించగల నిపుణులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో సుప్రసిద్ధ నటి, నర్తకి వైజయంతీమాల అగ్రస్థానంలో నిలుచుంటారు.
ఓ నాటి తమిళ అందాలతార వసుంధరాదేవి కుమార్తె వైజయంతీ మాల. 1943లో రంజన్ హీరోగా రూపొందిన ‘మంగమ్మ శపథం’లో మంగమ్మగా నటించి అలరించారు వసుంధరాదేవి. తరువాత ఆమె ఎమ్.డి.రామన్ ను వివాహం చేసుకున్నారు. వారి కూతురు వైజయంతీమాలకు సైతం బాల్యంలోనే కళల పట్ల ఎంతో అభిమానం ఉండేది. కన్నవారు ఆమెను నాట్యంలో రాణించాలని ప్రోత్సహించారు. పిన్నవయసులోనే ప్రదర్శన ఇచ్చి పరవశింప చేశారు. 13 ఏళ్ళ వయసులోనే వైజయంతీ మాల నటనారంగంలో అడుగు పెట్టారు. ‘వాళ్కై’ తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసిన వైజయంతీమాల, వెంటనే తెలుగు సినిమా ‘జీవితం’లోనూ నటించారు. ఆ పై హిందీ చిత్రం ‘బహార్’లోనూ మురిపించారు. ఒకే కథ, ఒకే పాత్ర మూడు భాషల్లోనూ వరుసగా వైవిధ్యం ప్రదర్శిస్తూ వైజయంతి నటించారు దాంతో అన్ని భాషలవారినీ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. తరువాత యన్టీఆర్ ‘సంఘం’లోనూ కీలక పాత్ర పోషించి మురిపించారు. అనేక తమిళ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు హిందీ సినిమాల్లో నటించే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు వైజయంతీమాల. ప్రదీప్ కుమార్ తో ఆమె నటించిన ‘నాగిన్’ అనూహ్య విజయం సాధించింది. దిలీప్ కుమార్ ‘దేవదాస్’లో చంద్రముఖిగా నటించి మరపురాని అభినయం ప్రదర్శించారు. ఈ నాటికీ చంద్రముఖి అంటే వైజయంతీమాల అనే తీరున నిలచిపోయారు. తరువాత “న్యూ ఢిల్లీ, నయా దౌర్, ఆశా, సాధనా, మధుమతి” చిత్రాలలో వైజయంతీమాల అభినయంతో పాటు నృత్యం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ కపూర్ ‘సంగం’లో వైజయంతీమాల అందం, ఆ నాటి రసికులకు బంధాలు వేసింది. చారిత్రక చిత్రం ‘ఆమ్రపాలి’లో వైజయంతి నటనను ఎవరూ మరచిపోలేరు. 1968లో వైజయంతీమాలకు పద్మశ్రీ పురస్కారం లభించింది. 1970లో రాజేంద్రకుమార్ హీరోగా రూపొందిన ‘గాన్వార్’ వైజయంతీమాల నటించిన చివరి చిత్రం.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
సినిమాలకు గుడ్ బై చెప్పిన తరువాత వైజయంతీమాల నర్తకిగా తనదైన బాణీ పలికిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. భరతనాట్యంకు మరింత ప్రాచుర్యం సంపాదించి పెడుతూ ఆమె ప్రదర్శనలు సాగాయి. వైజయంతీమాల నాట్యం తిలకించిన ఎందరో తమ పిల్లలను నాట్యకళాకారులుగా మార్చడానికి పూనుకున్నారు. 1984లో ఎన్నికలలో సౌత్ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీచేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1989లో మరోమారు లోక్ సభకు పోటీచేసి విజయం సాధించారు వైజయంతి. 1993లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆరేళ్ళు ఆ పదవిలో కొనసాగిన వైజయంతీమాల 1999లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. ఇప్పటి దాకా అదే పార్టీలో కొనసాగుతున్నారు. 85 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వైజయంతీమాల మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!