భారతదేశంలో బెంగాలీ సాహిత్యం ఇతర ప్రాంతాలపైనా విశేషమైన ప్రభావం చూపింది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తన బెంగాలీ, ఆంగ్ల రచనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను అలరించారు. ఆ రోజుల్లో ఆయనకు ఎనలేని అభిమానగణాలు ఉండేవి. అంతటి రవీంద్రనాథుడు తనను కట్టిపడేసే రచనలు చేసిన రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ అని సెలవిచ్చారు. శరత్ చంద్రుడు కూడా వంగదేశ రచయితనే. రవీంద్రుని కంటే వయసులో 15 ఏళ్ళు చిన్నవాడు. అయినా రవీంద్రుని, శరత్ బాబు రచనలు అమితంగా ఆకర్షించాయంటే…
కొందరిని చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతటి అందం సొంతం చేసుకున్నవారిలో కళలు నెలకొని ఉంటే మరింతగా చూసి మురిసిపోతాము. ఆ కళల్లోనూ కరగని వైభవం ఉందంటే, అభిమానంతో కరిగిపోతూ, ఆ కళల నిలయాన్ని ఆరాధిస్తూ ఉంటాము. రాతి గుండెల్లో సైతం కళాభిరుచి కలిగించగల నిపుణులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో సుప్రసిద్ధ నటి, నర్తకి వైజయంతీమాల అగ్రస్థానంలో నిలుచుంటారు. ఓ నాటి తమిళ అందాలతార వసుంధరాదేవి కుమార్తె వైజయంతీ మాల. 1943లో రంజన్ హీరోగా రూపొందిన…