చిత్రవిచిత్రాల వి.యస్.ఆర్.స్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలోని ఇప్పుడున్న ఎంతోమంది సినిమాటోగ్రాఫర్స్ కు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురువుగా నిలిచారు వి.ఎస్.ఆర్.స్వామి. ఆయన కెమెరా పనితనంతో రూపొందిన అనేక చిత్రాలు జనానికి కనువిందు చేశాయి. తెలుగు చిత్రసీమలో తొలి సినిమాస్కోప్-ఈస్ట్ మన్ కలర్ చిత్రంగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’కు ఆయనే సినిమాటోగ్రాఫర్. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే తన కెమెరా పనితనంతో జనాన్ని ఆకట్టుకున్నారు స్వామి. నలుపు-తెలుపు చిత్రాలలో సందర్భానుసారంగా ‘సిల్హౌట్స్’ను ఉపయోగించి మెప్పించారు. రంగుల చిత్రాలలోనూ సందర్భానికి తగిన యాంగిల్స్ తో రంజింపచేశారు. అందుకే ఈ నాటికీ సినిమాటోగ్రాఫర్స్ వి.ఎస్.ఆర్.స్వామి పేరును తలచుకుంటూ ఉంటారు. ఎంతోమంది ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు తరువాతి రోజుల్లో సినిమాటోగ్రాఫర్స్ గా పేరు సంపాదించారు.
గుడివాడలో జన్మించిన వి.ఎస్.ఆర్.స్వామి బాల్యం నుంచీ ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నారు. చిత్రసీమలో ప్రవేశించాక అన్నయ్య, సి.నాగేశ్వరరావు వంటి వారి వద్ద పనిచేశారు. ఆ రోజుల్లో ‘వెస్ట్రన్ ఇండియా సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్’ (డబ్ల్యు.ఐ.సి.ఏ)లో పేరు నమోదు చేయించుకోవడం కెమెరా మెన్ ఓ గొప్పగా భావించేవారు. స్వామి తక్కువ కాలంలోనే అందులో తన పేరు నమోదు చేయించుకోగలిగారు. ఆయన పనితనం గమనించిన దర్శకుడు వి.రామచంద్రరావు తన ‘అసాధ్యుడు’ చిత్రం ద్వారా వి.ఎస్.ఆర్.స్వామిని సినిమాటోగ్రాఫర్ గా పరిచయం చేశారు.
Also Read
read also : అనకాపల్లి మెడికల్ కాలేజీపై వైసీపీలో చర్చ!
ఈ చిత్రంలో కథానుసారంగా ఓ సందర్భంలో హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు నాటికలో సీతారామరాజుగా కనిపిస్తారు. ఆ సన్నివేశాన్ని తెరకెక్కించడంలో వి.ఎస్.ఆర్.స్వామి కెమెరా పనితనం భలేగా పనిచేసింది. ‘అసాధ్యుడు’ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. చాలామంది స్వామి కెమెరా వర్క్ గురించి చర్చించుకున్నారు. తరువాత యన్టీఆర్ తో కె.హేమాంబరధర రావు రూపొందించిన ‘కథానాయకుడు’ చిత్రానికి కూడా వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అందులో “ఇంతేనయా తెలుసుకోవయా…” పాట రంగుల్లో ఉంటుంది. ఆ పాటను తెరకెక్కించిన తీరు, సందర్భానుసారంగా కెమెరాను నడిపించిన విధానం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యన్టీఆర్ మారువేషం వేసుకొని వచ్చిన సమయంలో ఆయన కాలి బూట్ల మధ్య నుండి విలన్స్ ను చిత్రీకరించిన తీరు అప్పట్లో జనం ముచ్చటించుకొనేలా చేసింది.
“మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అందాలరాముడు, భక్త తుకారాం, భక్త కన్నప్ప, సిరి సిరిమువ్వ, ఖైదీ, కొండవీటి దొంగ, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసిం హనాయుడు, ఇంద్ర” వంటి జనరంజక చిత్రాలకు వి.ఎస్.ఆర్.స్వామి సినిమాటోగ్రఫి దన్నుగా నిలచింది. యన్టీఆర్ హీరోగా ‘ఎదురీత’ చిత్రాన్ని నిర్మించడంలో భాగస్వామిగా వ్యవహరించారు స్వామి. ‘ఆపద్బాంధవులు’, ‘మహాశక్తిమాన్’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. దాసరి దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన చారిత్రక చిత్రం ‘విశ్వనాథ నాయకుడు’ ద్వారా బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నందిని అందుకున్నారు వి.ఎస్.ఆర్.స్వామి.
తాజావార్తలు
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..