Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్నానన్న రష్మిక.. అసలు సంగతి చెప్పిన ఎయిర్ లైన్స్ ప్రతినిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vistara Airlines Respose on Rashmika Mandanna Flight Incident: బాలీవుడ్ నటి రష్మిక మందన్న తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సమాచారాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని నటి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ ప్రతినిధి మాత్రం అసలు విషయం చెప్పారు. ప్రతినిధి చెబుతున్న దాని ప్రకారం, రష్మిక చెప్పినంత తీవ్రత లేదట. విమానంలో కొంత సమస్య ఉంది, అది సమయానికి తనిఖీ చేయబడిందని పేర్కొన్నారు. నిజానికి రష్మిక ముంబై నుంచి హైదరాబాద్కు వెళుతోంది. అయితే విమానంలో సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో మరో విమానంలో ప్రయాణికులందరితో సహా హైదరాబాద్కు పంపించారు. రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేసుకున్నారు. రష్మిక క్షేమంగా ఉన్నప్పటికీ ఆమె ఈ ఫోటో చూసి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఎయిర్లైన్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ – 17 ఫిబ్రవరి 2024న, ముంబై నుండి హైదరాబాద్కు నడుస్తున్న విస్తారా విమానం UK531లో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం గుర్తించబడింది.
Suhani Bhatnagar Death Reason: దంగల్ నటి చనిపోయింది అలా కాదు.. ఆ మహమ్మారే ప్రాణం తీసింది!
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, పైలట్లు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం మళ్లీ టేకాఫ్ అయ్యేలోపు ముందుగా విమానంలో అవసరమైన తనిఖీలు చేపట్టారు. ఇంతలో, ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడింది, అది కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్కు బయలుదేరింది. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి సమయానికి ఆహారం మరియు నీరు అందేలా అన్ని ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. విస్తారాలో, మా కస్టమర్లు మరియు సిబ్బంది భద్రత మాకు అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ఇక రష్మిక మందన్న ఇటీవల రణబీర్ కపూర్తో యానిమల్ చిత్రంలో కనిపించింది. బాబీ డియోల్, అనిల్ కపూర్ మరియు తృప్తి దిమ్రీ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సినిమాలో రణబీర్తో ఆమె కెమిస్ట్రీ ఆడియన్స్ కి బాగా నచ్చింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?