Suhani Bhatnagar Death Reason: దంగల్ నటి చనిపోయింది అలా కాదు.. ఆ మహమ్మారే ప్రాణం తీసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhani Bhatnagar Death Reason Revealed by his father: దంగల్ చిత్రంలో రెజ్లర్ బబితా ఫోగట్ చిన్ననాటి పాత్రను పోషించిన సుహాని భట్నాగర్, కేవలం 19 ఏళ్ల వయసులోనే అనారోగ్యానికి చికిత్స పొందుతూ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్లో మరణించారు. అయితే ఆమె ఒంట్లో నీరు చేరడం వలన మరణించింది అంటే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం సుహాని చేయి వాచిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అప్పుడు డెర్మాటోమయోసిటిస్ వ్యాధి కారణంగా, శరీరంలో నీరు (ద్రవం) నింపడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఇక నిన్న సాయంత్రం అజ్రౌండా శ్మశానవాటికలో సుహాని అంత్యక్రియలు జరిగాయి. సెక్టార్ 17 నివాసి సుహానీ భట్నాగర్ ఆరేళ్ల వయసులో దంగల్ లో నటించి వెలుగులోకి వచ్చింది, అనేక యాడ్స్ లో కూడా కనిపించింది. ఆమె ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్ చదువుతోంది.
Premalu: మలయాళ ‘ప్రేమలు’.. తెలుగోళ్ళు కూడా హైదరాబాద్ ను ఇంత బాగా చూపించలేదు కదరా!
Also Read
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
- Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
ఇక ఆమె మరణం గురించి తండ్రి పునీత్ భట్నాగర్ తన చేతులపై ఎర్రటి దద్దుర్లు కారణంగా అలెర్జీ అని భావించానని, ఆ తర్వాత అతను ఫరీదాబాద్లోని చాలా ఆసుపత్రులలో చికిత్స అందించామని చెప్పాడు. పది రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. తన కూతురు డెర్మటోమయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోందని తండ్రి పునీత్ భట్నాగర్ తెలిపారు. రెండు నెలల క్రితం కూతురు చేతిపై ఎర్రటి మచ్చ ఏర్పడిందని, తమ కూతురు ఎలర్జీతో బాధపడుతోందని, ఆ తర్వాత ఫరీదాబాద్లోని చాలా పెద్ద ఆసుపత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారని, అయితే ఏ ఆస్పత్రుల్లోని వైద్యులు వ్యాధిని గుర్తించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఆమె పరిస్థితి విషమించడం ప్రారంభించినప్పుడు, తన కుమార్తెను చికిత్స కోసం మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చినట్టు పేర్కొన్నారు., అయితే అక్కడ కూడా తన కుమార్తె పరిస్థితి మెరుగుపడలేదని, నెమ్మదిగా ఆమె శరీరం నీటితో నిండిపోయిందని అన్నారు. దీంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఈ లోకానికి వీడ్కోలు పలికిందని అన్నారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!