రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. మహిళా నక్సలైట్ సరళ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి, జరీనా వాహెబ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలను ఈ సినిమా అందుకున్నా, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. దాంతో జూలై 1వ తేదీ నుండి దీనిని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు అనుమతి ఇచ్చారు. గతంలోనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వస్తుందనే సమాచారం ఇచ్చినా, స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇవాళే ప్రకటించారు.