Vamshi Paidipally Birthday Special: ఆచి తూచి అడుగులేస్తున్న వంశీ పైడిపల్లి
Vamshi Paidipally Birthday Special :
నవతరం దర్శకుల్లో ప్రతి ఒక్కరు తమ ఉనికిని చాటుకోవడానికి వైవిధ్యంతో సాగుతున్నారు. విజయం సాధించిన తరువాత ప్రతిభను మరింతగా ప్రదర్శించాలనీ తపిస్తుంటారు. ఆ పై లభించిన పేరును నిలుపుకొనే ప్రయత్నంలోనూ సరైన కథ కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటారు. దర్శకుడు వంశీ పైడిపల్లి అలా సాగుతున్నారు కాబట్టే పరుగులు తీస్తూ సినిమాలు తెరకెక్కించడం లేదు. ఘనవిజయాలు పలకరించినా, పులకించి పోయి వేగమూ పెంచలేదు. ఆచి తూచి అడుగులేస్తూ సాగుతున్నారు.
పైడిపల్లి వంశీధరరావు 1979 జూలై 27న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో జన్మించారు. వాళ్ళ నాన్నకు ఖానాపూర్ లో సినిమా థియేటర్ ఉండేది. దాంతో చిన్న తనం నుంచీ వంశీకి సినిమాలంటే ఆకర్షణ. చదువులోనూ అంతే ఆసక్తితో సాగారు. హైదరాబాద్ జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి వరకు చదివిన వంశీ, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్స్ లో మాస్టర్ డిగ్రీ సాధించారు. సినిమాలపై ఆసక్తితో 2002లో ప్రభాస్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘ఈశ్వర్’కు దర్శకుడు జయంత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు వంశీ. తరువాత దిల్ రాజు ‘భద్ర’ సినిమాకు పనిచేస్తూ, ఆయనను తన కథతో ఆకట్టుకున్నారు. వంశీని ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ చిత్రంతో దర్శకునిగా పరిచయం చేశారు దిల్ రాజు. తరువాత జూ.యన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ‘బృందావనం’కు కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఆ సినిమా మంచి విజయం సాధించి, దర్శకునిగా వంశీకి మంచి గుర్తింపును సంపాదించింది.
Also Read
- Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
- The Paradise: 'ఆయా షేర్' తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. 'ది ప్యారడైజ్' సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
- Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
- Mega 158 Update: 'మెగా 158' నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ 'స్వాగ్'తో బాస్ లుక్.. చూశారా?
తొలిచిత్రానికి, రెండో సినిమాకు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నారు వంశీ. ఆ తరువాత నాలుగేళ్ళకు రామ్ చరణ్, బన్నీతో ‘ఎవడు’ రూపొందించారు. ఈ సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాత కావడం విశేషం! ‘ఎవడు’ తీసిన రెండేళ్ళకు నాగార్జున, కార్తీతో ‘ఊపిరి’ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. మరో మూడేళ్ళకు మహేశ్ బాబుతో ‘మహర్షి’ తీశారు వంశీ. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఉత్తమ వినోదభరిత చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఇంత పెద్ద విజయం చూసినా, వంశీ పరుగులు తీయలేదు. ఓ మంచి కథను సిద్ధం చేసుకున్న తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ తో ప్రస్తుతం ‘వారిసు’ అనే సినిమాను రూపొందిస్తున్నారు వంశీ. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తూ ఉండడం విశేషం! తెలుగులో ‘వారసుడు’గా ఈ సినిమా రానుంది. వచ్చే యేడాది జనవరిలో ‘వారిసు’ జనం ముందుకు రానుంది. ఆచి తూచి అడుగులేస్తున్న వంశీ పైడిపల్లి ఈ సినిమాతో ఏ స్థాయి సక్సెస్ ను అందుకుంటారో చూద్దాం.
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో